Breaking News

కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం…

Read More

భీంగల్ బ్రహ్మంగారి దేవాలయ భూమి రికార్డులపై తెల్పాలని విశ్వబ్రాహ్మణ సంఘం వారు ప్రజావాణిలో ఫిర్యాదు..

భీంగల్ ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) భీంగల్ గ్రామంలోని నంది గల్లి బస్సు డిపో వెంకన్న ఉన్న బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోనికి తీసుకురావాలని విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినారు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల వివరణ ప్రకారము సర్వేనెంబర్ 675లోని 6.0800 ఎకరాల భూమి పాత రెవిన్యూ రికార్డు లోనికి శ్రీ బ్రహ్మం గారి దేవాలయానికి సంబంధించిన భూమి…

Read More

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి

హైకోర్టు తీర్పును సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం పెండింగ్‌లో ఉన్న అర్హుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్)కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించి, అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ…

Read More

తెలంగాణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ఏర్పాటు

నూతన కార్యవర్గం ఎన్నిక.. అప్రైజర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ హైదరాబాద్ ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఆల్ బ్యాంక్స్ గోల్డ్ అప్రైజర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు రాఘవాచారి, ఉపాధ్యక్షులు కొండూజు విజయ్ కుమార్ చారి, కార్యనిర్వాహక కార్యదర్శి అనంత రాములు తదితరులు…

Read More

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌పై స్టే.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఏమిటి?

పేదింటి ఆడబిడ్డల పెళ్లి సాయంపై న్యాయపరమైన ప్రతిష్టంభన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు పథకం రద్దు కాలేదా? స్టే మాత్రమేనా? అసలు వివాదం ఏమిటి? నిజామాబాద్, ఆగస్టు 17: E6tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ లో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలు ప్రస్తుతం రాజకీయ, న్యాయపరమైన చర్చకు కేంద్రంగా మారాయి. ఈ పథకాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇటీవల మధ్యంతర…

Read More

బాడాపహాడ్ కమాన్ నిర్మాణానికి భూమి పూజ

వర్ని, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి) వర్ని మండల కేంద్రంలోని బాడాపహాడ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించనున్న బాడాపహాడ్ కమాన్ (స్వాగత తోరణం) నిర్మాణ పనులకు మాజీ డీసీసీబీ చైర్మన్  పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు.స్థానిక నాయకులతో కలిసి ఆయన కమాన్ నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. బాడాపహాడ్ చౌరస్తా వద్ద నిర్మించనున్న ఈ స్వాగత తోరణం వర్ని పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నాయకులు తెలిపారు. ఈ…

Read More

బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

బాల్కొండ నియోజకవర్గంలో 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్: ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే…

Read More

బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి

బిచ్కుంద, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి).జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె జోనిట–దాస్ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై కాబోయే వధూవరులు జోనిట–దాస్‌లను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ విందులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ…

Read More

ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి బయలుదేరిన మల్లాపూర్ గ్రామ ప్రజలు

డోంగ్లీ, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామం నుంచి జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు గ్రామ ప్రజలు ఆదివారం బయలుదేరారు.ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారి కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించేందుకు మల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన దంపతుల జీవితం సుఖసంతోషాలతో సాగాలని…

Read More

జోనిట వివాహ విందుకు మారేపల్లి గ్రామ ప్రజలకు ఆత్మీయ ఆహ్వానం

డోంగ్లీ, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి) డోంగ్లీ మండలం మారేపల్లి గ్రామ ప్రజలకు స్థానిక సర్పంచ్ గాయక్వాడ్ శ్రీధర్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జోనిట వివాహ విందు కార్యక్రమం ఆగస్టు 16, 2026 ఆదివారం రోజున డీబీఎల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మారేపల్లి గ్రామ ప్రజలందరూ వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని సర్పంచ్ శ్రీధర్ కోరారు. నూతన దంపతుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో…

Read More