Technology
భీంగల్లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య…
గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కుల పంపిణీ
బోధన్ ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్లోని గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.గత వారం వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులు పలు సమస్యలను వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందకపోవడం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం, దోమతెరలు, లైట్లు, ఫ్యాన్ల కొరతతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన నోటుబుక్కులు, మ్యాట్లు, ఇతర…
రైల్లో 24.3 కిలోల ఎండు గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకుల అరెస్ట్
నిజామాబాద్, ఆగస్టు 21: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున 12.35 గంటల సమయంలో సాయినగర్ షిర్డీ రైలులో RPF పోలీసులు, నిజామాబాద్ SHO ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తమ సీట్ల కింద రెండు సూట్కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. సూట్కేసులను తనిఖీ చేయగా మొత్తం 24.3 కిలోల ఎండు గంజాయి…
సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి: కాంగ్రెస్
ఎర్గట్ల, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాబిన్హుడ్గా పేరొందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్ ట్యాంక్బండ్పై సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల ఏరుగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్, ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన తీసుకువచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ నాయకులు,…
ఒక హత్య.. ఎన్నో ప్రశ్నలు
గురువుకు గోరీ కట్టిన గంజాయి మత్తు! స్పెషల్ స్టోరీ, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి).చదువు చెప్పి జీవితానికి బాటలు వేయాల్సిన గురువే దారుణ హత్యకు గురికావడం.. ఆ హత్యకు పదో తరగతి చదువుతున్న విద్యార్థులే పాల్పడ్డారన్న దర్యాప్తు అంశాలు వెలుగులోకి రావడం.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడటం, చెడు…
నందిపేట ప్రయాణికుల నరకయాతన కథనం నిరాధారం: టీజీఎస్ఆర్టీసీ
నిజామాబాద్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) నందిపేట ప్రయాణికుల ఇబ్బందులపై ఇటీవల ఓ పత్రికలో ప్రచురితమైన “నందిపేట ప్రయాణికుల నరకయాతన” కథనం పూర్తిగా నిరాధారమని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో మేనేజర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.నిజామాబాద్–నందిపేట మార్గంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను సమర్థవంతంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిజామాబాద్-1 డిపో నుంచి నందిపేట మధ్య 5 పల్లెవెలుగు, 4 ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు….
బస్వాపూర్లో తాగునీటి సరఫరాపై సమీక్ష
బస్వాపూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనితీరుపై గ్రామ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.గ్రామంలోని మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు, ఏడు సింగిల్ఫేజ్ మోటార్ల పనితీరుపై చర్చించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలను…
పొనకల్–హైదరాబాద్ బస్సు సర్వీసు పునరుద్ధరించాలి
ఎర్గట్ల, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).పొనకల్ గ్రామం నుంచి హైదరాబాద్కు నిలిపివేసిన బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని ఎర్గట్ల మండల సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి సర్పంచులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, పొనకల్ నుంచి హైదరాబాద్కు నడిచే బస్సు సర్వీసు నిలిపివేయడంతో ఎర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో దోంచందా సీబీఎస్ బస్సు, గుమ్మిర్యాల్ నైట్…
అవసరాల ఆధారిత కనీస వేతనం రూ.39,373 ఇవ్వాలి: TUCI
భీంగల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు కార్మికులకు అవసరాల ఆధారిత కనీస వేతనం నెలకు రూ.39,373 చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భీంగల్ మండల కేంద్రంలోని ALO కార్యాలయం ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUCI నిజామాబాద్-కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు…
రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా.. సద్భావన, జాతీయ ఐక్యత కోసం ప్రతిజ్ఞ
కామారెడ్డి ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది…

