Technology
అవసరాల ఆధారిత కనీస వేతనం రూ.39,373 ఇవ్వాలి: TUCI
భీంగల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు కార్మికులకు అవసరాల ఆధారిత కనీస వేతనం నెలకు రూ.39,373 చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భీంగల్ మండల కేంద్రంలోని ALO కార్యాలయం ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUCI నిజామాబాద్-కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు…
రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా.. సద్భావన, జాతీయ ఐక్యత కోసం ప్రతిజ్ఞ
కామారెడ్డి ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది…
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాజకీయ గ్రహణం?
దళిత, పేద ప్రజలను వెంటాడుతున్న సమస్యలు.. పేదింటి కలగా మిగులుతున్న ఇందిరమ్మ ఇళ్లు వేంసూరు, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన దళిత, పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని, పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పేదింటి కల అయిన…
వేంసూరు మండలంలో అధికారుల పనితీరుపై ప్రజల ఆగ్రహం
ప్రభుత్వ లక్ష్యాలకు కొందరు అధికారుల తీరుతో గండి? ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు స్థానికంగా అందుబాటులో లేని సిబ్బందిపై మండల ప్రజల అసంతృప్తి పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవంటున్న ప్రజాప్రతినిధులు వేంసూరు,ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి కొందరు అధికారుల పనితీరు అడ్డంకిగా మారుతోందని వేంసూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను…
విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు
మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల కేంద్రంలోని నడిమ హనుమాన్ మందిరం వద్ద విద్యుత్ వైర్లకు అడ్డుగా వస్తున్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను బుధవారం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ పరిశీలించారు.మందిరం ముందు శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న పనులపై విద్యుత్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో…
సలాబాత్పూర్ గ్రామానికి నూతన పోలింగ్ బూత్
మద్నూర్ ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). ఏళ్లుగా ఎదురుచూస్తున్న సలాబాత్పూర్ గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభించింది. సలాబాత్పూర్ గ్రామానికి ప్రత్యేకంగా నూతన పోలింగ్ బూత్ మంజూరు కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మద్నూర్ మండలం చిన్న శక్కార్గ గ్రామపంచాయతీ పరిధిలోని సలాబాత్పూర్, చిన్న శక్కార్గ గ్రామాలకు గతంలో ఒకే పోలింగ్ బూత్ ఉండేది. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో సలాబాత్పూర్ గ్రామస్థులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చిన్న శక్కార్గ గ్రామానికి వెళ్లి తమ ఓటు…
కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు జుక్కల్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కౌలాస్ కోటను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న…
పాపన్న గౌడ్ సాక్షిగా దళిత బహుజనుల హక్కుల కోసం ఐక్య ఉద్యమం
నిర్మల్, ఆగస్టు 18: (Etv NEWS,A. తిరుపతి గౌడ్). సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌడజన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించారు.కార్యక్రమానికి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ…
ఎంపీ అరవింద్పై విమర్శలు చేస్తే ఊరుకోం
బీజేపీ కార్పొరేటర్ల హెచ్చరిక నిజామాబాద్ ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ హెచ్చరించారు.జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగినన్ని…
పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు
నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…

