Medchal
వేంసూరు మండలంలో అధికారుల పనితీరుపై ప్రజల ఆగ్రహం
ప్రభుత్వ లక్ష్యాలకు కొందరు అధికారుల తీరుతో గండి? ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు స్థానికంగా అందుబాటులో లేని సిబ్బందిపై మండల ప్రజల అసంతృప్తి పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవంటున్న ప్రజాప్రతినిధులు వేంసూరు,ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి కొందరు అధికారుల పనితీరు అడ్డంకిగా మారుతోందని వేంసూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను…
చేయని తప్పుకు పోలీసుల వేధింపులు.. కష్టకాలంలో అండగా నిలిచిన పోచారం, E6tv NEWS యాజమాన్యానికి అశోక్ కృతజ్ఞతలు.
అక్బర్నగర్, ఆగస్టు 20: (E6tv NEWS ప్రతినిధి). చేయని తప్పుకు పోలీసుల కక్ష సాధింపు, వేధింపులకు గురయ్యానని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు అండగా నిలిచి, జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు పోచారం శ్రీనివాస్రెడ్డి దేవుడితో సమానమని అశోక్ అన్నారు. ఆయన ఆశీర్వాదం, దయతోనే తాను జైలు నుంచి…
భీమ్గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్రెడ్డి
రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ భీమ్గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి). భీమ్గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ…
ఎంపీడీఓ సాయిలును సన్మానించిన మెనూర్ సర్పంచ్
మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి. సాయిలును మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పి. సాయిలు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. మద్నూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ…
బైక్ దొంగల ముఠా అరెస్ట్.. రెండు బైకులు స్వాధీనం
మద్నూర్, ఆగస్ట్ 18: (E6tv NEWS: ప్రతినిధి). బైక్లను దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మద్నూర్ ఎస్ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పట్టుకుని రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దేగ్లూర్కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్లు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని చాకూర్ పోలీసులు వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని మద్నూర్, డోంగ్లీ మండలాల్లో బైక్లను దొంగిలించేందుకు…
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ నిజామాబాద్, ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల…
పాపన్న ఆశయాలు నెరవేర్చినప్పుడే అసలైన నివాళి
నిర్మల్, ఆగస్టు 18: (E6tv NEWS:A. తిరుపతి గౌడ్) సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గౌడ సంఘాల నాయకులు, వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రతినిధులు పాల్గొని సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి…
పేదలకు భూమి పంపిణీ చేయాలి: కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మరోసారి భూ పంపిణీ అవసరం అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకంతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి: కవిత బంజారాహిల్స్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే మరోసారి భూ పంపిణీ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు భూమి పంపిణీ చేయాలన్న డిమాండ్తో పాటు, తాము అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకం ద్వారా ప్రతి…
పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు
నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
హైదరాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపకుండా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ,…

