Medchal
రేషన్ కార్డుల పేరుతో కేటుగాళ్ల వసూళ్లు..
కలెక్టరేట్ ఉద్యోగి పేరుతో నకిలీ ఐడీ కార్డు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS). రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ కలెక్టరేట్ జూనియర్ అసిస్టెంట్ పేరుతో నకిలీ ఐడీ కార్డు చూపించి పలువురి నుంచి నగదు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. బండి మధు పేరుతో ఉన్న ఐడీ కార్డును చూపిస్తూ రేషన్ కార్డులు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్నారని తెలిపారు.అయితే కొంతకాలం గడిచినా రేషన్ కార్డులు రాకపోవడంతో బాధితులు ఆరా తీయగా, తమకు చూపించిన ఐడీ…
ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు పొదెం వీరయ్య వినతి భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీలో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు.బుధవారం భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్హౌస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఐదు గ్రామాలు ప్రస్తుతం ఏపీ పరిధిలో…
దళిత స్పీకర్పై అసభ్య పదజాలం సరికాదు
బీఆర్ఎస్ నేతల దురహంకారానికి పరాకాష్ట.. బాల్కొండలో తాతా మధు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం బాల్కొండ, సెప్టెంబర్ 8: (E6 tv NEWS: ప్రతినిధి). శాసనసభ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి అసభ్యకర, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు, ఈ ఘటనకు…
దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
భీంగల్లో కాంగ్రెస్ నాయకుల ఆందోళన.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం భీంగల్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ఒకవైపు దళితులపై దాడులు జరుగుతుంటే, మరోవైపు దళిత స్పీకర్పై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో…
గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సాంకేతిక నిపుణుల బృందం రెండు రోజులుగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలతపై భౌగోళిక, భౌతిక, సాంకేతిక అంశాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో కొనసాగుతున్న పరిశీలనను జిల్లా కలెక్టర్ అంకిత్ ఏఏఐ సాంకేతిక బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన…
జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్…
గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గణేష్ మండపాల నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే ముందు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో…
భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష
అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణి, గ్రూప్-1 అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత…
తిరస్కరించిన ఓట్లను పునరుద్ధరించుకోవాలి
పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో తిరస్కరించబడిన ఓట్లను పునరుద్ధరించుకోవాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, డీసీఎస్ఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. పాత పాల్వంచలోని 78, 79, 80, 81 పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్లతో బీఎల్ఓలు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. ఓటు హక్కు…
వ్యవసాయ పరిశోధనా కేంద్రం ముధోల్లో సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల క్షేత్ర సందర్శన
ముధోల్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ముధోల్లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని భైంసాకు చెందిన శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. ఆకుల దినేష్ మరియు డా. కిషోర్ ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ (Soil Sampling), నేల పరీక్షల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం మరియు పంటల పెరుగుదలలో నేల పోషకాల పాత్ర గురించి అవగాహన కల్పించారు.అలాగే ఎల్ నినో (El…

