Nalgonda
చేయని తప్పుకు పోలీసుల వేధింపులు.. కష్టకాలంలో అండగా నిలిచిన పోచారం, E6tv NEWS యాజమాన్యానికి అశోక్ కృతజ్ఞతలు.
అక్బర్నగర్, ఆగస్టు 20: (E6tv NEWS ప్రతినిధి). చేయని తప్పుకు పోలీసుల కక్ష సాధింపు, వేధింపులకు గురయ్యానని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో తనకు అండగా నిలిచి, జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు పోచారం శ్రీనివాస్రెడ్డి దేవుడితో సమానమని అశోక్ అన్నారు. ఆయన ఆశీర్వాదం, దయతోనే తాను జైలు నుంచి…
భీమ్గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్రెడ్డి
రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ భీమ్గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి). భీమ్గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ…
సలాబాత్పూర్ గ్రామానికి నూతన పోలింగ్ బూత్
మద్నూర్ ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). ఏళ్లుగా ఎదురుచూస్తున్న సలాబాత్పూర్ గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభించింది. సలాబాత్పూర్ గ్రామానికి ప్రత్యేకంగా నూతన పోలింగ్ బూత్ మంజూరు కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మద్నూర్ మండలం చిన్న శక్కార్గ గ్రామపంచాయతీ పరిధిలోని సలాబాత్పూర్, చిన్న శక్కార్గ గ్రామాలకు గతంలో ఒకే పోలింగ్ బూత్ ఉండేది. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో సలాబాత్పూర్ గ్రామస్థులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చిన్న శక్కార్గ గ్రామానికి వెళ్లి తమ ఓటు…
ప్రపంచ ఫోటోగ్రఫీ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు ఫోటో జర్నలిస్టుల సేవలు అమోఘం ఇందూరు, ఆగస్టు 19:( E6tv NEWS:శివ ఠాకూర్). ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని, సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక సంఘటనలను భవిష్యత్ తరాలకు…
బైక్ దొంగల ముఠా అరెస్ట్.. రెండు బైకులు స్వాధీనం
మద్నూర్, ఆగస్ట్ 18: (E6tv NEWS: ప్రతినిధి). బైక్లను దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మద్నూర్ ఎస్ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పట్టుకుని రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దేగ్లూర్కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్లు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని చాకూర్ పోలీసులు వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని మద్నూర్, డోంగ్లీ మండలాల్లో బైక్లను దొంగిలించేందుకు…
కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు జుక్కల్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కౌలాస్ కోటను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న…
ఎంపీ అరవింద్పై విమర్శలు చేస్తే ఊరుకోం
బీజేపీ కార్పొరేటర్ల హెచ్చరిక నిజామాబాద్ ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ హెచ్చరించారు.జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగినన్ని…
హుజూర్నగర్లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన
హుజూర్నగర్, ఆగస్టు 17:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు హుజూర్నగర్ సీఐ చరమందరాజు, ఎస్ఐ చలిగంటి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కళాబృందం ద్వారా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్…
వందేమాతరం గీతం ప్రతి భారతీయుడి గుండెల్లో నిలవాలి
నిజామాబాద్, ఆగస్టు 17: (E6 tv NEWS: శివ ఠాకూర్). బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం గీతం కీలక పాత్ర పోషించిందన్నారు. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం గీతం రణనినాదంగా మారి ప్రజలను చైతన్యవంతం చేసిందని తెలిపారు. బంకించంద్ర చటర్జీ దూరదృష్టితో వందేమాతరం…
భీంగల్ బ్రహ్మంగారి దేవాలయ భూమి రికార్డులపై తెల్పాలని విశ్వబ్రాహ్మణ సంఘం వారు ప్రజావాణిలో ఫిర్యాదు..
భీంగల్ ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) భీంగల్ గ్రామంలోని నంది గల్లి బస్సు డిపో వెంకన్న ఉన్న బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోనికి తీసుకురావాలని విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినారు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల వివరణ ప్రకారము సర్వేనెంబర్ 675లోని 6.0800 ఎకరాల భూమి పాత రెవిన్యూ రికార్డు లోనికి శ్రీ బ్రహ్మం గారి దేవాలయానికి సంబంధించిన భూమి…

