Medchal
ఆర్టీసీ బస్సులో భద్రత గాలికేనా..?
బాన్సువాడ డిపో ఎక్స్ప్రెస్ బస్సులో ప్రమాదకర పరిస్థితులు TS16UC3338 బస్సు లో ఉన్న ప్రయాణికుల ఆందోళన.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్ ఆగస్టు 31:(E6tv NEWS: శివ ఠాకూర్). ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల్లోనే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాన్సువాడ డిపోకు చెందిన TS16UC3338 ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు కాలు పెట్టే ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయని,…
మానాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మూడు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి: ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం విశాలమైన భవనంలోకి పాఠశాలను తరలిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం: వేముల ప్రశాంత్ రెడ్డి మానాల,ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) మానాల మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారుభవన…
SIR ఫేజ్–2పై BLAలు, సూపర్వైజర్లకు శిక్షణ
మోర్తాడ్, ఆగస్టు 30:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గ స్థాయి BLAలు (బూత్ లెవెల్ ఏజెంట్లు), BLA సూపర్వైజర్లకు SIR ఫేజ్–2పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని RNB ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం జరిగింది.కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, SIR ఇంచార్జ్ ఊట్ల వరప్రసాద్ హాజరై BLAలు, సూపర్వైజర్లకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. SIR ఫేజ్–2లో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు BLO…
ఇరిగేషన్ జాగా కబ్జాపై అధికారుల చర్యలు
కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేత స్థలం ఖాళీ చేయకపోతే రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కఠిన చర్యలు ఇరిగేషన్ ఏఈ రవికుమార్ హెచ్చరిక రుద్రూర్, ఆగస్టు 30:(E6tv NEWS ప్రతినిధి).నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఇరిగేషన్ శాఖ ఏఈ రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని…
ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన
నిర్మల్, ఆగస్టు 30: (E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట మోచి సంఘంలో ఎస్ఐఆర్ (SIR) ఫామ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్, బీఎల్ఓ ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఓటర్లు తమకు అందిన నోటీసుతో పాటు, పాత ఓటర్ జాబితా లేదా 2002…
ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించిన నిర్మల్ రూరల్ ఎంఆర్ఓ రాజు
నిర్మల్,ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి).ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు నిర్మల్ రూరల్ ఎంఆర్ఓ రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం వైయస్సార్ కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై వివరించారు. నోటీసులకు ఆధారాలు జత చేయాలి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఆర్ఓ రాజు తెలిపారు. నోటీసుతో పాటు తమ వద్ద ఉన్న…
పేదల సంక్షేమమే ధ్యేయం.. అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు
జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జుక్కల్, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల…
ముందస్తు టికెట్ బుకింగ్ సద్వినియోగం చేసుకోండి
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి విజ్ఞప్తి నిజామాబాద్, ఆగస్టు 28:( E6tv NEWS: ప్రతినిధి). ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ అందిస్తున్న ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల చివరి…
సుల్తాన్పేట్లో SIR–2026పై గ్రామసభ
మద్నూర్, ఆగస్టు 27: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామంలో SIR–2026 ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ పాల్గొని ఓటరు జాబితాలో పేర్ల నమోదు, వివరాల్లో మార్పులు, అనర్హుల పేర్ల తొలగింపు తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఏవైనా తప్పులు, అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానాన్ని తహసీల్దార్ వివరించారు. ప్రతి…
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి
కంటేశ్వర్లో ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న విధానం పరిశీలన నిజామాబాద్, ఆగస్టు 27: అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారు, అలాగే పేరు, వయసు తదితర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు హియరింగ్కు హాజరు కావాలని కోరుతూ బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు…

