Breaking News

వైఎస్సార్‌కు ఘన నివాళులు

నిజాంసాగర్ సెప్టెంబర్ 2:(E6tv NEWS ప్రతినిధి). పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల…

Read More

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి

సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసన కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్,ఆగస్టు 31: (E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక…

Read More

గణేష్ మండపాల వద్ద విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన బిచ్కుంద ప్రతినిధులు కామారెడ్డి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండలం నుంచి సమావేశానికి హాజరైన శెట్పల్లి విష్ణు గణేష్…

Read More

సంక్షేమ హాస్టళ్లలో మేస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐపీఎస్‌యూ బోధన్, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి). సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే పెంచాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) డిమాండ్ చేసింది.AIPSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIPSU బోధన్ డివిజన్…

Read More

SIR ఫేజ్–2పై BLAలు, సూపర్వైజర్లకు శిక్షణ

మోర్తాడ్, ఆగస్టు 30:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గ స్థాయి BLAలు (బూత్ లెవెల్ ఏజెంట్లు), BLA సూపర్వైజర్లకు SIR ఫేజ్–2పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని RNB ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది.కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, SIR ఇంచార్జ్ ఊట్ల వరప్రసాద్ హాజరై BLAలు, సూపర్వైజర్లకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. SIR ఫేజ్–2లో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు BLO…

Read More

చెన్నమ్మ కోరి దేవస్థానంలో భక్తుల సందడి

మద్నూర్, ఆగస్టు 29:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కుర్చీర్ గ్రామంలోని కోడిచీర శివారులో వెలసిన చెన్నమ్మ కోరి దేవస్థానంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. చిన్న ఎక్లార గ్రామస్తులు, భక్తుల ఆధ్వర్యంలో దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని చెన్నమ్మ కోరి అమ్మవారిని దర్శించుకుని…

Read More

విద్యా.. వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చూడాలి.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు జుక్కల్, ఆగస్టు 28: (E6tv NEWS: ప్రతినిధి).నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంత రావు అన్నారు.జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ…

Read More

రూ.30 లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి భూమిపూజ

మారుమూల గ్రామాల్లో ధాన్యం నిల్వకు ఉపయోగకరం – సర్పంచులు, తండా పెద్దమనుషులు మానాల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ పరిధిలోని స్కూల్ తండా గ్రామపంచాయతీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఐకేపీ గోడౌన్‌కు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మానాల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, తండా పెద్దమనుషులు, ప్రజాప్రతినిధులు కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కొనుగోలు…

Read More

ఏర్గట్లలో వైభవంగా జంధ్యాల పౌర్ణమి వేడుకలు

శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఏర్గట్ల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండల కేంద్రంలో శ్రీ శివమార్కండేయ మాతృ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పౌర్ణమి (నూతన యజ్ఞోపవీత ధారణ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ…

Read More

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు

నిజామాబాద్, ఆగస్టు 27:(E6tv NEWS: ప్రతినిధి) రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో టీజీఎస్‌ఆర్టీసీ సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరవేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన…

Read More