Nalgonda
బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు!
జమ్మికుంట, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి).జమ్మికుంట బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఉద్యోగుల వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు, గతంలో జరిగిన వ్యవహారాలపై అధికారులు ఆరా…
ఇంకా నిరుపేదలు ఉన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న మరో 10 మంది పేదలను ఆదుకోవాలిరోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రుద్రూర్, సెప్టెంబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం ఆర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు….
జుక్కల్ చౌరస్తాలో బస్సు ప్రమాదం
డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…
నకిరేకల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ…
నకిరేకల్/కట్టంగూర్: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని కట్టంగూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య విషయాలు:
పాలిటెక్నిక్కా లేజీ భూములపై రేవంత్ సర్కార్ కన్ను: కేటీఆర్ సంచలన ఆరోపణలు!
నల్లగొండ (E6TV న్యూస్): పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 (GO 97) వల్ల తమ భవిష్యత్తు అంధకారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) గేటు వద్ద కేటీఆర్కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్న కేటీఆర్, వారికి బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని కొండంత…
ప్రభుత్వ భూమిపై ఆక్రమణ ఆరోపణలు.. సర్వే నంబర్ 555, 555/1పై అధికారుల ఆరా
సలీం ఫారం పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాల ఆరోపణలు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి వ్యవహారంభూమి రికార్డులు, వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు క్షేత్రస్థాయి సర్వేతోనే అసలు వాస్తవాలు తేలే అవకాశం సలీం ఫారం,నవీపేట, సెప్టెంబర్ 3 :(E6tv NEWS ప్రత్యేక కథనం-శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని సలీం ఫారం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు…
కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన
420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
కమ్మర్పల్లి, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నర్సయ్య, వీసీ…
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. ప్రభుత్వానికి పని చేసేందుకు సమయం ఇచ్చినా మార్పు రాకపోవడంతో, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల ముందు ప్రదర్శించారు; ఈ నిరసనలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ప్రజలకు…
కవిత వ్యాఖ్యలకు వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్
కేసీఆర్కు దగ్గరగా ఉన్న వారినే కవిత టార్గెట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవితను కేసీఆర్కు తాను దూరం చేయడానికి ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండించారు.కవితను, కేసీఆర్ను కలపడానికి తానే ప్రయత్నించానని, విడగొట్టడానికి ప్రయత్నించానన్న విషయం…

