Warangal
సుల్తాన్పేట్లో SIR–2026పై గ్రామసభ
మద్నూర్, ఆగస్టు 27: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామంలో SIR–2026 ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ పాల్గొని ఓటరు జాబితాలో పేర్ల నమోదు, వివరాల్లో మార్పులు, అనర్హుల పేర్ల తొలగింపు తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఏవైనా తప్పులు, అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానాన్ని తహసీల్దార్ వివరించారు. ప్రతి…
భీంగల్లో రోడ్ల గుంతలకు మరమ్మతు చర్యలు
భీంగల్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన రోడ్ల గుంతలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పూడ్చే చర్యలు చేపట్టారు. గుంతల్లో చిప్స్ పోసి బ్లేడ్ బండితో చదును చేసి రహదారిని శుభ్రం చేశారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బుదిరే నాగమణి స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ జైజై లత, జైజై నరసయ్య, కౌన్సిలర్లు…
బాల్కొండలో గంజాయి ముఠాపై పోలీసుల దాడి.. 19 మంది పట్టివేత
బాల్కొండ, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ మండల వన్నెల్-బి వరద కాలువ గట్టు వద్ద గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో బాల్కొండ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న 18 మందితో పాటు గంజాయి విక్రయించేందుకు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరద కాలువ గట్టు వద్ద కొంతమంది గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 18 మంది…
నిజామాబాద్లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ…
బస్వాపూర్లో ఘనంగా వన మహోత్సవం
బస్వాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటారు. కేజీబీవీ, ప్రభుత్వ యూపీఎస్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రంతో పాటు బస్వాపూర్ బసవన్న చెరువు కట్టపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ శ్రీమతి వి. రమణ సురేష్, ఉప సర్పంచ్ బి. అనిల్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బి. రాజు ఆధ్వర్యంలో వన మహోత్సవ…
మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవం
మద్నూర్, ఆగస్టు 25:(E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధిమండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబరావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్…
నిజామాబాద్ ఐడీఓసీ హెలిప్యాడ్కు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
నిజామాబాద్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఐడీఓసీ హెలిప్యాడ్కు చేరుకున్నారు. గవర్నర్కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం కావడంతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా…
మద్నూరును నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని వినతి
మద్నూర్, ఆగస్టు 25: (E6tv NEWS ప్రతినిధి). మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ మండల ప్రజలు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో సాయిలు, తహసీల్దార్ ముజీబ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. గతంలో మద్నూర్ మండలం నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమయంలో పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల సేవలు సులభంగా అందుబాటులో ఉండేవని తెలిపారు. ప్రస్తుతం మద్నూర్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రం సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉండగా,…
జమ్మికుంటలో అంగన్వాడీ చిన్నారులకు స్లేట్లు పంపిణీ
జమ్మికుంట, ఆగస్టు 24: (E6tv NEWS: ప్రతినిధి). కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్లేట్లు, స్లేట్ పెన్సిళ్లను పంపిణీ చేశారు. 6వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వర్ణలతమాట్లాడుతూ.. చిన్నారుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. చిన్న వయస్సు నుంచే విద్యపై ఆసక్తి కలిగించడం ద్వారా వారి భవిష్యత్కు మంచి పునాది…
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి
కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే…

