Warangal
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసన కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్,ఆగస్టు 31: (E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక…
గణేష్ మండపాల వద్ద విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన బిచ్కుంద ప్రతినిధులు కామారెడ్డి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండలం నుంచి సమావేశానికి హాజరైన శెట్పల్లి విష్ణు గణేష్…
బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
నియోజకవర్గ కేంద్రాన్ని కాదని మారుమూల గ్రామాన్ని ఎలా ఎంపిక చేస్తారు? జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన మన హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు బాల్కొండ, ఆగస్టు 31:(E6tv NEWS:ప్రతినిధి).బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ మన హక్కుల కౌన్సిల్ సామాజిక, సాంస్కృతిక విభాగం ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం కింద రెండో అప్పీల్కు సంబంధించిన వినతిపత్రాన్ని…
సంక్షేమ హాస్టళ్లలో మేస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐపీఎస్యూ బోధన్, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి). సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే పెంచాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) డిమాండ్ చేసింది.AIPSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIPSU బోధన్ డివిజన్…
దినేష్ కులచారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
జక్రాన్పల్లి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జక్రాన్పల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దినేష్ కులచారి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ శివలింగేశ్వర స్వామివారిని ప్రార్థించారు. అనంతరం అంకాపూర్లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి…
ఇరిగేషన్ జాగా కబ్జాపై అధికారుల చర్యలు
కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేత స్థలం ఖాళీ చేయకపోతే రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కఠిన చర్యలు ఇరిగేషన్ ఏఈ రవికుమార్ హెచ్చరిక రుద్రూర్, ఆగస్టు 30:(E6tv NEWS ప్రతినిధి).నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఇరిగేషన్ శాఖ ఏఈ రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని…
ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించిన నిర్మల్ రూరల్ ఎంఆర్ఓ రాజు
నిర్మల్,ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి).ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు నిర్మల్ రూరల్ ఎంఆర్ఓ రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం వైయస్సార్ కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై వివరించారు. నోటీసులకు ఆధారాలు జత చేయాలి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఆర్ఓ రాజు తెలిపారు. నోటీసుతో పాటు తమ వద్ద ఉన్న…
విద్యా.. వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి పీహెచ్సీల్లో మందుల కొరత లేకుండా చూడాలి.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు జుక్కల్, ఆగస్టు 28: (E6tv NEWS: ప్రతినిధి).నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ…
ముందస్తు టికెట్ బుకింగ్ సద్వినియోగం చేసుకోండి
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి విజ్ఞప్తి నిజామాబాద్, ఆగస్టు 28:( E6tv NEWS: ప్రతినిధి). ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ అందిస్తున్న ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల చివరి…
సుల్తాన్పేట్లో SIR–2026పై గ్రామసభ
మద్నూర్, ఆగస్టు 27: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామంలో SIR–2026 ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ పాల్గొని ఓటరు జాబితాలో పేర్ల నమోదు, వివరాల్లో మార్పులు, అనర్హుల పేర్ల తొలగింపు తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఏవైనా తప్పులు, అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానాన్ని తహసీల్దార్ వివరించారు. ప్రతి…

