E6TV Special Storys
it is exclusive Content for E6TV
పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్
సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు పోటీలు దేశవ్యాప్తంగా 300–400 మంది సీనియర్ క్రీడాకారుల రాక పాల్వంచ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం జంట నగరాల వేదికగా తొలిసారిగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శ్యామల గోపాలం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి సహకారంతో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు టోర్నమెంట్ జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల…
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి ‘సై’
శిల్పినగర్, కేజీబీవీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం భద్రాచలం ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు భద్రాచలం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థి కేంద్రంగా బోధన అందిస్తున్నామని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు. శిల్పినగర్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ భద్రాచలం విద్యార్థులు చురుకుగా, ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తూ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి తాము సైతం సిద్ధమంటున్నారని తెలిపారు. గురువారం భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్…
గణేష్ ఉత్సవ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలి: డీఎస్పీ ఆదినారాయణ
కొత్తగూడెం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్, మున్సిపల్ శాఖల నిబంధనలు మరియు సూచనలను తప్పనిసరిగా పాటించాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ సూచించారు.గణేష్ మండపం ఏర్పాటు చేయడానికి ముందుగా సంబంధిత పోలీస్, మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై, ఇరుకైన వీధుల్లో, వివాదాస్పద స్థలాల్లో లేదా ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు. మండపం, స్టేజ్,…
భూ రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
సీతాయిగూడెంలో రీ-సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ అర్హులైన భూహక్కుదారులకు పాస్బుక్లు పొందే అవకాశం చండ్రుగొండ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భూ రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, ప్రక్రియను వేగవంతంగా, పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ…
ఇందిరా ప్రియదర్శినికి కాళోజి నంది అవార్డు
కొత్తగూడెం అడ్వకేట్కు దక్కిన అరుదైన ఘనతబెస్ట్ జూనియర్ అడ్వకేట్’గా రాష్ట్రస్థాయి గుర్తింపు బెస్ట్ జూనియర్ అడ్వకేట్’గా రాష్ట్రస్థాయి గుర్తింపు పాల్వంచ,సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాద రంగానికి మరో విశిష్ట గౌరవం దక్కింది. కొత్తగూడెం పట్టణంలోని ప్యూన్బస్తీకి చెందిన అడ్వకేట్ ఇందిరా ప్రియదర్శిని జిల్లా కోర్టు పరిధిలో ప్రతిభ కనబరిచి బెస్ట్ జూనియర్ అడ్వకేట్ గా ఎంపికయ్యారు. అంతేకాకుండా కాళోజి జయంతిని పురస్కరించుకుని ప్రదానం చేసే ప్రతిష్టాత్మక కాళోజి నంది అవార్డు ను సైతం…
ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం
నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రాత్మకం పీడిత ప్రజల విముక్తికి ఐక్య పోరాటాలు అవసరం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కొత్తగూడెం, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి)వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన అసమాన పోరాటస్ఫూర్తి చిరస్మరణీయమని, నేటి తరానికి ఆమె ఆదర్శప్రాయురాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో…
వ్యవసాయానికి 18 గంటలు విద్యుత్ ఇవ్వాలని వినతి
మద్నూర్, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) వ్యవసాయానికి రోజుకు 18 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సుల్తాన్పేట్ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు గురువారం మేనూర్లోని అదనపు సహాయక ఇంజినీర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయానికి కనీసం…
ఆర్య సమాజ్లో శ్రావణమాసం ముగింపు మహాయజ్ఞం
మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండల కేంద్రంలోని ఆర్య సమాజ్లో శ్రావణమాసం ముగింపు సందర్భంగా గురువారం మహాయజ్ఞం నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులు, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఏడాది శ్రావణమాసం ముగింపు అమావాస్య రోజున యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆర్య సమాజ్ సభ్యులు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన మహాయజ్ఞంలో ఆర్య సమాజ్ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముగింపుగా ఈ…
దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ
ముధోల్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ అన్నారు.ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోతన్న యాదవ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ చూపిన తెగువ,…
ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శిబిరం నిర్వహించారు. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు శిబిరానికి హాజరై, తమ తల్లిదండ్రులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఓటర్లు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో అర్హత, పత్రాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ధ్రువీకరణ పత్రాల…

