ఎమ్మెల్యేలతో హత్య రాజకీయాలా?: వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను అంతమొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చావును కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన… షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డి విమర్శల్లోని ముఖ్యాంశాలు:

