Breaking News

గ్రామగ్రామాన గణేషుడు.. 300కు పైగా విగ్రహాల ఉచిత పంపిణీ

హుజూర్‌నగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ అధినేత, బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని భక్తులకు 300కు పైగా గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.భక్తి, సేవ, ఐక్యత అనే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత, భక్తులు గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను నిర్వహించేందుకు ఈ ఉచిత విగ్రహాల పంపిణీ దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ వినాయక చవితి కేవలం పూజలు, ఉత్సవాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే పర్వదినమన్నారు. జ్ఞానం, ఐక్యత, సోదరభావం, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలను ఈ పండుగ చాటిచెబుతుందని అన్నారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

300కు పైగా గణేష్ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడంతో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉత్సవాల సందడి మరింత పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *