Technology
జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్…
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో 40 మందికి వాషింగ్ మిషన్ల పంపిణీ
మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మద్నూర్ పోస్టు కార్యాలయంలో 40 మంది అర్హులైన లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం, బీజేపీ యువ నాయకుడు అజయ్ తమ్మేవార్ తెలిపారు. మద్నూర్ పోస్టు కార్యాలయానికి విశ్వకర్మ యోజనలో భాగంగా 40 వాషింగ్ మిషన్లు మంజూరు కాగా, అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ మిషన్లు లబ్ధిదారుల జీవనోపాధికి,…
‘APPLE’ డబుల్ ధమాకా: ఐఫోన్ 18తో పాటు తొలి ‘ఫోల్డబుల్ ఐఫోన్’!
హైదరాబాద్: టెక్ దిగ్గజం యాపిల్ (Apple) 2026 సంవత్సరానికిగానూ ఐఫోన్ ప్రేమికులకు భారీ శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్-నవంబర్ పండగ సీజన్ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ‘ఐఫోన్ 18’ సిరీస్తో పాటు, యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా రూపొందించిన ‘ఫోల్డబుల్ ఐఫోన్’ (Foldable iPhone) ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ కొత్త లాంచ్ల వల్ల భారత మార్కెట్లో యాపిల్ షిప్మెంట్లు లాంచ్ త్రైమాసికంలో ఏకంగా 40 శాతం…
గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గణేష్ మండపాల నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే ముందు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో…
ఇంటిని తలపిస్తున్న సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల
పరిశుభ్రత, నిర్వహణపై ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు ప్రశంసలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సమాజం సహకరించాలి భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి) సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం, మరుగుదొడ్ల నిర్వహణ పరిశుభ్రంగా ఉండి ఇంటి వాతావరణాన్ని తలపిస్తోందని మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు.సోమవారం పాఠశాలల సందర్శనలో భాగంగా ఆయన సీతారామనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు,…
స్పీకర్ గడ్డం ప్రసాద్పై తాతా మధు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంది ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న…
జీఓ 97 రద్దు చేయాలి
రాహుల్ గాంధీకి AISF పోస్ట్కార్డుల ద్వారా విద్యార్థుల వినతి కొత్తగూడెం,సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో జీఓ నంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ AISF ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం రాహుల్ గాంధీకి పోస్ట్కార్డుల ద్వారా వినతి తెలిపారు.ఈ సందర్భంగా AISF జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల విజయ్ మాట్లాడుతూ.. SBTET బోర్డును యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య కార్పొరేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన…
గిరిజన దర్బార్ వినతులకు సత్వర పరిష్కారం
ప్రతి విన్నపాన్ని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).గిరిజన దర్బార్లో ఆదివాసీ గిరిజనులు సమర్పించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి వినతులు, సమస్యలపై ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఐటీడీఏ సహాయ…
తాళ్ల రాంపూర్, దోమచందాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తాళ్ల రాంపూర్, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతిని) ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను తాళ్ల రాంపూర్, దోమచందా గ్రామాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో తహసీల్దార్తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని కార్డులను పంపిణీ చేశారు.తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇన్చార్జి సర్పంచ్ చాట్ల జనార్ధన్, దోమచందా గ్రామంలో సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్…
కుంటాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్కు రూ.9 కోట్ల నిధులు
కుంటాల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). కుంటాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు….

