Khamam
దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
భీంగల్లో కాంగ్రెస్ నాయకుల ఆందోళన.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం భీంగల్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ఒకవైపు దళితులపై దాడులు జరుగుతుంటే, మరోవైపు దళిత స్పీకర్పై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో…
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన పి. నాగభూషణం ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. జగన్ మోహన్ రావు ముదిరాజ్ మంగళవారం నాగభూషణానికి నియామక పత్రాన్ని అందజేశారు.మారుమూల ప్రాంతమైన అంతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల మద్నూర్ మండల ముదిరాజ్ సంఘ…
స్పీకర్ను దూషించిన ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి
కమ్మర్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కమ్మర్పల్లి, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన…
గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సాంకేతిక నిపుణుల బృందం రెండు రోజులుగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలతపై భౌగోళిక, భౌతిక, సాంకేతిక అంశాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో కొనసాగుతున్న పరిశీలనను జిల్లా కలెక్టర్ అంకిత్ ఏఏఐ సాంకేతిక బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన…
జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్…
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో 40 మందికి వాషింగ్ మిషన్ల పంపిణీ
మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మద్నూర్ పోస్టు కార్యాలయంలో 40 మంది అర్హులైన లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం, బీజేపీ యువ నాయకుడు అజయ్ తమ్మేవార్ తెలిపారు. మద్నూర్ పోస్టు కార్యాలయానికి విశ్వకర్మ యోజనలో భాగంగా 40 వాషింగ్ మిషన్లు మంజూరు కాగా, అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ మిషన్లు లబ్ధిదారుల జీవనోపాధికి,…
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి
మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులు భూ పత్రాలు, హద్దులు చూపించి సహకరించాలి పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నంబర్ 77లో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రోవర్ పరికరాల సహాయంతో భూములను కొలుస్తున్న విధానం, క్షేత్రస్థాయిలో…
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష
ఆరోగ్య సూపర్వైజర్లకు డీఎంహెచ్ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచనలు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్ఓ, కొత్తగూడెం కార్యాలయ సమావేశ మందిరంలో ఆరోగ్య సూపర్వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. తుకారామ్ రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ భూక్యా రామ్ దాస్, డాక్టర్ టీ. ప్రతాప్, డాక్టర్ దినేష్, సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష
అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణి, గ్రూప్-1 అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత…
ఎన్నికల హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ను వదలం
కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన పాల్వంచ, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆ పార్టీని వదిలేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్…

