Nalgonda
పలువురి దశదినకర్మల్లో పాల్గొని సంతాపం తెలిపిన కొత్వాల
కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించిన కొత్వాల దంపతులు. పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ పట్టణ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, పాతపాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ఆదివారం పరామర్శించారు. ఆయా కుటుంబాల్లో నిర్వహించిన దశదినకర్మలు, చిన్నకర్మ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాల్వంచకు చెందిన…
చెస్లో నవభారత్ విద్యార్థుల సత్తా
అండర్-10లో భట్టు జైకి ప్రథమ బహుమతి.. అండర్-15లో లిఖిత సాయికి ఐదో స్థానం పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్-10 విభాగంలో భట్టు జై ప్రథమ బహుమతి సాధించగా, అండర్-15 విభాగంలో భట్టు లిఖిత సాయి ఐదో స్థానంలో నిలిచి ప్రతిభ కనబరిచింది.గత నాలుగు నెలలుగా జిల్లాస్థాయి చెస్ పోటీల్లో వరుసగా…
దశాబ్దాల రైతుల కల సాకారం!
మారెళ్లపాడు లిఫ్ట్లో గోదావరి పరవళ్లు.. 16,180 ఎకరాలకు సాగునీటి భరోసా అశ్వాపురం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల కళ్లలో దశాబ్దాలుగా మెదులుతున్న సాగునీటి కల సాకారమైంది. వర్షాలు సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటడంతో బీడుగా మారిన భూములకు గోదావరి జలాలను అందించాలన్న రైతుల చిరకాల వాంఛ మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంతో నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తవడంతో ఆయకట్టు…
తుమ్మల చెరువు రైతుల సాగునీటి కల నెరవేరే దిశగా కీలక అడుగు
మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ సక్సెస్.. రైతుల్లో ఆనందోత్సాహాలు అశ్వాపురం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). తుమ్మల చెరువు రైతుల చిరకాల సాగునీటి కల సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో చేపట్టిన మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో తుమ్మల చెరువు ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గోదావరి జలాలను తుమ్మల చెరువుకు తరలించి తమ పొలాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాంత…
అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య పరీక్షలు: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలం–చర్ల రోడ్డులో రాధా హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ను భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మల్ల ప్రతాప్ కుమారుడు నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా భద్రాచలం, పరిసర ప్రాంతాల…
స్థానిక యాష్ చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలి
KTPS యాష్ టెండర్పై TGGENCO సివిల్ డైరెక్టర్తో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ చర్చ పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). KTPS యాష్ లిఫ్టింగ్ పనులను KTPP, BTPS, YTPSతో కలిపి ఒకే భారీ టెండర్గా నిర్వహించే విధానాన్ని పునఃపరిశీలించి, స్థానిక చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కోరారు. పాల్వంచకు వచ్చిన ఆయన ధరావత్ సురేష్ నివాసంలో స్థానిక యాష్ కాంట్రాక్టర్లు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు….
భీంగల్లో అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పోలీసుల తనిఖీలు భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). మున్సిపల్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీంగల్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. శనివారం వాగు నుంచి ఇసుక తరలింపునకు ఎమ్మార్వో ఆదేశాల మేరకు అనుమతులు ఉన్నప్పటికీ, ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారం అందడంతో భీంగల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ…
యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలే లక్ష్యం
తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ: డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో యువత సంక్షేమం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్కుమార్ అన్నారు. పదేళ్ల నిరుద్యోగాన్ని తరిమికొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. భీంగల్ మండల కేంద్రంలో…
గంగ తెప్ప మహోత్సవంలో తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు
ఏర్గట్ల,సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్ ట్యాంక్బండ్లోని హుస్సేన్సాగర్ తీరంలో నిర్వహించిన గంగ తెప్ప మహోత్సవంలో ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు తొపారం రాజేశ్వర్ తెలిపారు. గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటేలా నిర్వహించిన ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి గంగపుత్ర సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని…
వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
అవకాశం వస్తే సంఘం అభివృద్ధికి తొలి ప్రాధాన్యత: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 6 (E6tv NEWS: ప్రతినిధి) శ్రీ వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని, నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మామిడి రాజేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నంగునూరి శ్రీనివాస్ గుప్తా (వాసు), కోశాధికారి అల్లా నగేష్ గుప్తా తదితరులు ప్రమాణ…

