Breaking News

గంగ తెప్ప మహోత్సవంలో తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు

ఏర్గట్ల,సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్వహించిన గంగ తెప్ప మహోత్సవంలో ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు తొపారం రాజేశ్వర్‌ తెలిపారు. గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటేలా నిర్వహించిన ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి గంగపుత్ర సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని…

Read More

వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

అవకాశం వస్తే సంఘం అభివృద్ధికి తొలి ప్రాధాన్యత: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 6 (E6tv NEWS: ప్రతినిధి) శ్రీ వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని, నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మామిడి రాజేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నంగునూరి శ్రీనివాస్ గుప్తా (వాసు), కోశాధికారి అల్లా నగేష్ గుప్తా తదితరులు ప్రమాణ…

Read More

1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు

ఏర్గట్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు – భారీ బైక్ ర్యాలీ ఏర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)..తెలంగాణలో రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు కావస్తున్న సందర్భంగా ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాల విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలతో బైక్‌లపై ర్యాలీగా మండల కేంద్రంలోని ప్రధాన…

Read More

పాల్వంచలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సు

పాల్వంచ, సెప్టెంబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి). ప్రవక్త ముహమ్మద్ జన్మదిన మాసమైన రబీ-ఉల్-అవ్వల్‌ను పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సును నిర్వహించనున్నారు.ఆదివారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న మదర్సా అధ్యక్షుడు షేక్ యూసుఫ్ నివాసంలో ఒడ్డుగూడెం దారుల్ ఉలూమ్ నూరియా హనఫియా మదర్సా కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు ప్రవక్త ముహమ్మద్ జీవిత విశేషాలు, బోధనలు, సందేశాలపై ప్రసంగించనున్నారు. మదర్సా విద్యార్థులు నాత్…

Read More

భక్తులకు మెరుగైన వసతులు.. భద్రాచలం అభివృద్ధికి మరింత ప్రాధాన్యత

రూ.1.50 కోట్లతో డార్మెటరీ హాల్‌కు శంకుస్థాపన భద్రాచలం, సెప్టెంబర్ 06:(E6tv NEWS: ప్రతినిధి). రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.భక్తుల వసతి కోసం రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డార్మెటరీ హాల్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి…

Read More

పేదల సంక్షేమం కోసం శ్రమించిన మహోన్నత నేత జగ్జీవన్ రామ్

డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత నేత, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ బీసీఎం రోడ్డులో దండోరా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం…

Read More

వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలపై రైతులకు శిక్షణ

పాల్వంచ: సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచ క్లస్టర్ పరిధిలోని కొత్తూరు గ్రామం పేటచెరువు వద్ద ఆత్మ (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) ఆధ్వర్యంలో “వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలు” అనే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.వ్యవసాయ విస్తరణ అధికారి జి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు, మండల వ్యవసాయ అధికారి పి. శంభోశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ…

Read More

ఎర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఎర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏరుగట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానం…

Read More

శ్రీ లీలామృత గ్రంథ పారాయణ సమాప్తి

ఘనంగా శోభాయాత్ర.. ఉత్సాహంగా దహీ హండి డోంగ్లి, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్రచార్య సంస్థానం అంతర్గత తెలంగాణ ఉపపీఠము, కామారెడ్డి జిల్లా డోంగ్లి సంత సంఘ సేవా కేంద్రం ఆధ్వర్యంలో గత 21 రోజులుగా నిర్వహించిన శ్రీ లీలామృత గ్రంథ పారాయణ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.జగద్గురు శ్రీ గారు రచించిన పవిత్ర శ్రీ లీలామృత గ్రంథాన్ని భక్తులు గత 21 రోజులుగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు….

Read More

నడిరోడ్డుపై బైక్‌ స్టంట్లు.. యువకుడిపై కేసు

ప్రమాదకర వీలింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్న మఠంపల్లి పోలీసులు మఠంపల్లి, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నడిరోడ్డుపై ద్విచక్రవాహనంతో ప్రమాదకరంగా వీలింగ్‌ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకుడిని మఠంపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మఠంపల్లి ప్రధాన చౌరస్తా నుంచి జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో పర్వతం గోపీచంద్ (19) అనే యువకుడు ద్విచక్రవాహనంపై అత్యంత ప్రమాదకరంగా స్టంట్లు…

Read More