E6TV Special Storys
it is exclusive Content for E6TV
బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు: మానాల మోహన్ రెడ్డి
ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు భీంగల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రస్తుతం రాష్ట్రానికి శాపాలుగా మారాయని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. భీంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోపించారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి…
జూలై 16–19 మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు.. వేడి నుంచి ఉపశమనం!
ప్రస్తుతం పొడి వాతావరణం.. 15 నుంచి పరిస్థితుల్లో మార్పు జూలై 16–19 మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు.. వేడి నుంచి ఉపశమనం! జూలై 15: E6 న్యూస్ స్పెషల్ ఆర్టికల్: శివ ఠాకూర్ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పొడి వాతావరణం, తీవ్రమైన ఎండల నుంచి ప్రజలకు త్వరలో కొంత ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…
నందిపేట్లో జర్నలిజం ముసుగులో పర్సంటేజీల దందా..?
విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఏజెన్సీల నుంచి శాతం % వసూళ్ల ఆరోపణలు నందిపేట్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ నందిపేట్ మండలంలో ఓ ప్రముఖ పత్రికలో సంవత్సరాలుగా పనిచేస్తున్న విలేఖరిపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, మండల కేంద్రంలో ఉన్న ప్రజల వద్ద నుండి పర్సంటేజీలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. స్వతహాగా నందిపేట్ నివాసి అయిన విలేకరి నందిపేట్ మండల కేంద్రం నుండి నిజామాబాద్ నగరానికి, నగరం నుండి నందిపేట్ మండల కేంద్రానికి ప్రతిరోజూ…
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి
డీఈవో అశోక్కు ప్రెస్ క్లబ్ వినతి – సానుకూల స్పందన ఒకటి, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 100 శాతం ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ కార్యదర్శి…
ఇందిరమ్మ ఇళ్ల ఇసుక అక్రమ దారి మళ్లింపు కేసులో చర్య
ఇసుకను అక్రమంగా దారి మళ్లించిన మెండోరా ఆర్.ఐ సస్పెన్షన్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లతో ఇసుక మళ్లించినట్లు ఆరోపణలు పూర్తిస్థాయి విచారణకు మైనింగ్ ఏడీకి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇసుక అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేరిట కేటాయించిన ఇసుకను అక్రమంగా దారి మళ్లించినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మెండోరా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్.ఐ) సదానంద్ను సస్పెండ్…
శభాష్ రుద్రూరు పోలీసులు..!
రోడ్డు మరమ్మత్తుల వద్ద ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ మళ్లింపు – పోలీసుల చొరవకు ప్రజల ప్రశంసలు రుద్రూరు, జూలై 13: E6 న్యూస్, ఔరాద్ అశోక్ నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తుల పనుల సందర్భంగా ప్రమాదాలు జరగకుండా రుద్రూరు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మరమ్మత్తులు జరుగుతున్న ప్రాంతంలో కాంట్రాక్టర్లు తప్పనిసరిగా ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ అవి లేకపోవడంతో పోలీసులు స్వయంగా చర్యలు చేపట్టారు. ప్రమాదాలను…
SIR పై పూర్తి అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో ఎం.కిరణ్ కుమార్.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యవసరం అర్హులంతా తప్పనిసరిగా వివరాలు ధృవీకరించుకోవాలి – ఎమ్మార్వో సూచన భీంగల్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు వివరాలను తప్పులులేకుండా రూపొందించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR)…
హైదరాబాద్లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!
హైదరాబాద్లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!ఈ6TV వెబ్ డెస్క్, హైదరాబాద్:గ్లోబల్ ఐటీ హబ్, ఆధునిక మౌలిక వసతులకు కేరాఫ్ అడ్రస్ అయిన భాగ్యనగరంలో కరెంట్ కోతలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. కాస్త గాలి వీచినా, వాన పడినా గంటల తరబడి కరెంట్ నిలిచిపోతుండటంతో ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ సాంకేతిక లోపాలు ఎందుకు వస్తున్నాయి? TGSPDCL (తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) ఎదుర్కొంటున్న సవాళ్లు…
పోతంగల్ మంజీరా నదిలో నుండి అక్రమ ఇసుక రవాణా…?
రాత్రివేళల్లో జోరుగా తరలింపు జరుగుతోందని స్థానికుల ఆరోపణలు అధికారులు నిఘా పెంచాలని ప్రజల డిమాండ్ కోటగిరి జూలై 13: E6 న్యూస్:నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్ మంజీరా నది లో నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి ఇసుక రవాణా ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతోందని వారు చెబుతున్నారు. పోతంగల్ నుంచి కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు, స్థానిక ట్రాక్టర్ల ద్వారా,…

