E6TV Special Storys
it is exclusive Content for E6TV
శిరీష హత్యాచార ఘటనపై నిందితుడిని కఠినంగా శిక్షించాలి
కొవ్వొత్తుల ర్యాలీ, మానవహారం నిర్వహించిన ఇల్లందు కాంగ్రెస్ శ్రేణులు ఇల్లందు: హైదరాబాద్లోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఊకే శిరీష పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి జగదాంబ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగదాంబ…
ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం: గణేష్ బిగాల
నిజామాబాద్, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీ సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానుంది. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సమయంలో…
బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు!
జమ్మికుంట, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి).జమ్మికుంట బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఉద్యోగుల వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు, గతంలో జరిగిన వ్యవహారాలపై అధికారులు ఆరా…
ఇంకా నిరుపేదలు ఉన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న మరో 10 మంది పేదలను ఆదుకోవాలిరోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రుద్రూర్, సెప్టెంబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం ఆర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు….
జుక్కల్ చౌరస్తాలో బస్సు ప్రమాదం
డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…
జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్సను విస్తృతం చేయాలి
ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్ చేయాలి: డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్). జీవనశైలి వ్యాధులైన హైపర్టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వాసి ముఖ్యఅతిథిగా హాజరై…
కాంగ్రెస్ 1000 రోజుల నయవంచన పాలనను ప్రజల్లో ఎండగడతాం
22A జాబితా పేరుతో ప్రైవేట్ భూముల యజమానులకు ఇబ్బందులు రైతు భరోసా, రైతుబీమా, ఉచిత విద్యుత్ను నిర్వీర్యం చేస్తున్నారు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 3:(E6tv NEWS ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్…
కాంగ్రెస్ పాలనలో రైతు దగా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల బాకీ: వేముల
కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలను పునరుద్ధరించాలి యూరియా యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులు అందించాలి బాల్కొండలో భారీ రైతు సదస్సు.. వేలాది మంది రైతుల తరలింపు వేల్పూర్, సెప్టెంబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాత దగా, మోసానికి గురవుతున్నాడని…
ప్రభుత్వ భూమిపై ఆక్రమణ ఆరోపణలు.. సర్వే నంబర్ 555, 555/1పై అధికారుల ఆరా
సలీం ఫారం పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాల ఆరోపణలు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి వ్యవహారంభూమి రికార్డులు, వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు క్షేత్రస్థాయి సర్వేతోనే అసలు వాస్తవాలు తేలే అవకాశం సలీం ఫారం,నవీపేట, సెప్టెంబర్ 3 :(E6tv NEWS ప్రత్యేక కథనం-శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని సలీం ఫారం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు…
కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన
420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…

