Breaking News

ప్రతి భారతీయుడికి గర్వకారమైన క్షణం.

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం.

న్యూఢిల్లీ/జకార్తా: E6 న్యూస్.

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన **’బింటాంగ్ ఆదిపూర్ణ’**ను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఘనంగా ప్రదానం చేశారు. భారత్–ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పరస్పర సహకారం విస్తరణకు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు మరియు భారత్–ఇండోనేషియా దేశాల మధ్య కొనసాగుతున్న అచంచలమైన స్నేహబంధానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

భారత్ మరియు ఇండోనేషియా మధ్య దౌత్య, వాణిజ్య, సాంస్కృతిక, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారం మరింత బలోపేతం కావడానికి ఈ గౌరవం ప్రతీకగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పురస్కారం భారతదేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *