Breaking News

Jhansi Rella

సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది: వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!

బాల్కొండ: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం, భూగర్భ జలాలు తీవ్ర ముప్పులో పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతుల మేలు కోసం నిర్మించిన ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలపై ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే చెరువులు, వాగులు జీవకళ సంతరించుకోవాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించిందని వేముల గుర్తుచేశారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని కప్పలవాగు,…

Read More

హైదరాబాద్ JNTUలో విద్యార్థుల ఘర్షణ: తీజ్ వేడుకల్లో రచ్చ.. కర్రలతో విచక్షణారహిత దాడి!

హైదరాబాద్ (కూకట్‌పల్లి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ (JNTUH) క్యాంపస్ రణరంగంగా మారింది. క్యాంపస్‌లో నిర్వహించిన తీజ్ వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య మొదలైన చిన్న వివాదం పెద్దదిగా మారి, రెండు వర్గాలు పరస్పరం భౌతిక దాడులకు దిగాయి. తీజ్ పండుగ వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి ఓ విద్యార్థిపై కొందరు దాడి చేయడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఆ తర్వాత పరిస్థితి మరింత ముదిరి గౌతమి, మంజీర హాస్టళ్లకు చెందిన విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి కర్రలతో ఒకరిపై…

Read More

మళ్లీ భగ్గుమన్న బంగారం: హైదరాబాద్‌లో లక్షన్నర దాటిన పసిడి ధర!

హైదరాబాద్: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కరోజులోనే 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,310 మేర పెరిగి రూ.1,56,660కి చేరింది. అదే సమయంలో ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 ఎగబాకి రూ.1,43,600 వద్ద ట్రేడ్ అవుతోంది. గడిచిన రెండు రోజుల…

Read More

నర్సంపేటలో సల్గుతున్న విగ్రహ వివాదం: పెద్ది సుదర్శన్ రెడ్డి గద్దె మళ్లీ కూల్చివేత!

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే, దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన వ్యవహారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తోంది. మెడికల్ కాలేజీ ఎదుట ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారులు తొలగించిన ఘటన మరవకముందే, బీఆర్ఎస్ శ్రేణులు మరోచోట కొత్తగా నిర్మించిన విగ్రహ గద్దెను సైతం గుర్తుతెలియని దుండగులు రాత్రికి రాత్రే ధ్వంసం చేయడం కలకలం రేపింది. దొంగచాటుగా వచ్చి గద్దెను కూల్చివేయడం వెనుక స్థానిక కాంగ్రెస్ నాయకుల కుట్ర దాగి…

Read More

కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు రిపీట్: ప్రభుత్వంపై వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!

బాల్కొండ: తెలంగాణ ఉద్యమ కాలం నాటి చీకటి రోజులు కాంగ్రెస్ పాలనలో మళ్లీ దాపురిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి ఉద్యమ సమయంలో రైతులు కరెంట్ కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి అండగా నిలిచామని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే విద్యుత్ మౌలిక వసతులను…

Read More

ఓటేసినందుకు రైతులను కాటేసింది: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశన్నగారి జీవన్ రెడ్డి ఫైర్!

ఆర్మూర్ (నందిపేట్): కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఓటేసిన పాపానికి రైతాంగాన్ని ప్రభుత్వం దారుణంగా కాటేసిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాయని ధ్వజమెత్తారు. ఆర్మూర్‌లో మూడో రోజు కొనసాగిన బీఆర్ఎస్ ఆందోళనల్లో భాగంగా నందిపేట్ మండల కేంద్రంలోని నంది గుడి వద్ద నిర్వహించిన ‘రైతు సదస్సు’లో జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా…

Read More

పాలిటెక్నిక్కా లేజీ భూములపై రేవంత్ సర్కార్ కన్ను: కేటీఆర్ సంచలన ఆరోపణలు!

నల్లగొండ (E6TV న్యూస్): పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 (GO 97) వల్ల తమ భవిష్యత్తు అంధకారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) గేటు వద్ద కేటీఆర్‌కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్న కేటీఆర్, వారికి బిఆర్‌ఎస్ పూర్తి అండగా ఉంటుందని కొండంత…

Read More

వడ్లు లేకుండానే కోటి రూపాయల దోపిడీ: కౌడిపల్లి స్కామ్‌పై ‘హరీష్ రావు’ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్ (E6TV న్యూస్): మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్ పిఎసిఎస్ (PACS) వడ్ల కొనుగోలు కేంద్రంలో భారీ కుంభకోణం జరిగిందని బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. కొనుగోలు కేంద్రానికి కనీసం ధాన్యం రాకుండానే కొనుగోలు చేసినట్లు కాగితాల్లో చూపించి, సుమారు కోటి రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. ఆరోపణల ముఖ్యాంశాలు

Read More

ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం!

హైదరాబాద్ (E6TV న్యూస్): తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల ప్రకారం తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, కనీస వివరణ కోరకుండానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె తన శాసనసభ్యత్వానికి (ఎమ్మెల్యే పదవికి) మరియు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి….

Read More

కొండా సురేఖకు కేఏ పాల్ బంపర్ ఆఫర్: ‘మా ప్రజాశాంతి పార్టీలోకి వచ్చేయండి’!

హైదరాబాద్ (E6TV న్యూస్): తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. క్యాబినెట్ నుంచి ఆమెను తొలగించడానికి ముందే కేఏ పాల్ సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, సురేఖ ఒక శక్త్యుపేతమైన నేత అని, ఆమె తమ పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కేఏ పాల్ వ్యాఖ్యల ముఖ్యాంశాలు

Read More