కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వివాదంపై కేంద్రం జోక్యం డిమాండ్!
న్యూఢిల్లీ / హైదరాబాద్ : మహారాష్ట్ర సరిహద్దులోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై నిర్మించతలపెట్టిన బ్యారేజీ ఎత్తు వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలోని శ్రమ్శక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్…

