68.64 లక్షల పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీకి 7 నెలల డెడ్లైన్ విధించిన సీఎం చంద్రబాబు
విజయవాడ / ఏలూరు: రాబోయే ఏడు నెలల్లో 9,365 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసి 68.64 లక్షల హై-సెక్యూరిటీ పట్టాదారు పాస్పుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా కాలిందిండి గ్రామంలో నిర్వహించిన ‘మీ-భూమి మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఏడు నెలల్లో 7,451 గ్రామాల్లో ఇప్పటికే 32.33 లక్షల పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపిన సీఎం, మిగిలిన పాస్పుస్తకాల పంపిణీ…

