మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు.. కీలక స్టేషన్లలో హెచ్ఎమ్ఆర్ఎల్ ఏఎమ్డీ అజిత్ రెడ్డి తనిఖీలు!
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులు, సేవలు అందించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ (AMD) బి. అజిత్ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆయన స్వయంగా మెట్రో రైలులో ప్రయాణించి బేగంపేట, అమీర్పేట్, రాయదుర్గం మెట్రో స్టేషన్లను, స్టేషన్ల పరిసరాల్లోని వీధి స్థాయి (Street Level) మౌలిక వసతులను, ప్లాట్ఫారమ్లు మరియు కాన్కోర్స్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు….

