Breaking News

Shiv Thakur

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

బాన్సువాడ ఆగస్టు 9: (E6 tv న్యూస్ ప్రతినిధి). యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, పండ్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత సమస్యల పరిష్కారం, నిరుద్యోగ నిర్మూలన, పేపర్ లీకుల నివారణ, ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతుల సమస్యల…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరూ ఈ నెల 16వ తేదీన జరిగే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించాలని మద్నూర్ సర్పంచ్ సంతోష్ మేస్త్రి కోరారు.కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. మద్నూర్ మండల ప్రజలు కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు తరలివచ్చి కార్యక్రమాన్ని…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరికీ పెద్ద ఎక్వొర సర్పంచ్ సోమర్ మహేష్ ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు. కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి మద్నూర్ మండల ప్రజలు పెద్ద…

Read More

అన్నాభావు సాథే విగ్రహా ఆవిష్కరణ  కార్యక్రమ ఏర్పాట్లపై మాదిగ నాయకుల చర్చ

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ)హాసన్ టాక్లి గ్రామంలో ఈ నెల 30వ తేదీన సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాథే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాదిగ జాతి ముద్దుబిడ్డ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరుకానున్న నేపథ్యంలో ఉమ్మడి మద్నూర్ మండలానికి చెందిన మాదిగ నాయకులు హాసన్ టాక్లి గ్రామాన్ని సందర్శించి కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, గ్రామస్థులతో సమావేశమై విగ్రహావిష్కరణ, సభ,…

Read More

టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా గులని సాయిలుకు ఘన సన్మానం

బిచ్కుంద, ఆగస్టు 9: (E6 tv NEWS ప్రతినిధి).టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన గులని సాయిలును బిచ్కుందలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన గులని సాయిలు టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం సామాజిక వర్గానికి మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడుతుందని…

Read More

ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం ఇందూరు యువత అదృష్టం: సీపీ సాయి చైతన్య

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి 70కి పైగా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు.. 2,500 మందికి పైగా అభ్యర్థుల హాజరు నిజామాబాద్, ఆగస్టు 9: (E6 tv NEWS, శివ ఠాకూర్).ప్రజాభివృద్ధితో పాటు యువత భవిష్యత్తు కోసం కృషి చేసే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ గార్డెన్స్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్…

Read More

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై విద్యార్థినుల తల్లిదండ్రులకు అవగాహన మద్నూర్, ఆగస్టు 08: E6 tv NEWS (M, మస్నాజీ).మద్నూర్ ఏపిహెచ్‌సీ డోంగ్లీ ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యత, వ్యాక్సిన్‌కు అర్హత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది విద్యార్థినుల తల్లిదండ్రులకు వివరించారు. వ్యాక్సినేషన్‌కు అర్హులైన 20 మంది విద్యార్థినులకు సంబంధిత పత్రాలను…

Read More

మద్నూర్‌లో ఆబ్కారీ శాఖ స్పెషల్ డ్రైవ్

కల్లు దుకాణాలు, దాబాలు, రైస్ మిల్లుల గోదాముల్లో విస్తృత తనిఖీలు మద్నూర్ ఆగస్టు 9: (E6 tv NEWS: M, మస్నాజీ) అక్రమ మద్యం విక్రయాలు, మాదకద్రవ్యాల రవాణా, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు మద్నూర్ మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి (ఈఎస్) ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు మద్నూర్ ఆబ్కారీ ఎస్‌ఐ నాగేష్ తెలిపారు….

Read More

పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

బహుజనుల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న చరిత్రను తెలుసుకోవాలి ఏర్గట్ల, ఆగస్టు 08: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్)మండల కేంద్రం ఏర్గట్లలో బహుజన ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజ్ 134వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద స్థానిక ముదిరాజ్ సంఘం సభ్యులు పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రెండ్ల రవి,…

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య కమ్మర్‌పల్లి, ఆగస్టు 8: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్). అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య అన్నారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా పెన్షన్లు…

Read More