Ongole
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు,…
భీంగల్లో ఘనంగా వన మహోత్సవం
ఇంటింటికీ మొక్కల పంపిణీ భీంగల్ ఆగస్టు 14: (E6 tv NEWS:T. గంగాధర్). ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ పట్టణంలోని 7, 8, 9, 10, 11, 12వ వార్డుల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్పర్సన్ సంటి లత నర్సయ్య, మున్సిపల్ కమిషనర్…
వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ
భీంగల్, ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ నుంచి 6వ వార్డుల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ హాజరయ్యారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, 2వ వార్డు…
బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం
బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్…
ఎయిడ్స్పై రెండు నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ భుజంగరావు బుధవారం ప్రారంభించారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రాజశ్రీతో కలిసి ఐఐఈసీ (Intensified Information, Education & Communication) కార్యక్రమాన్ని…
CEIR పోర్టల్తో 8 సెల్ఫోన్లు రికవరీ
యజమానులకు ఫోన్లు అందజేసిన భీంగల్ పోలీసులు భీంగల్, ఆగస్టు 11: E6 tv NEWS (T. గంగాధర్).భీంగల్ మండల పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశారు. మొత్తం 8 సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని సంబంధిత యజమానులకు అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు లేదా దరఖాస్తు చేయాలని పోలీసులు సూచించారు. ఫోన్ వివరాలను CEIR…
🇮🇳 భీంగల్లో ఘనంగా తిరంగా ర్యాలీ
భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్)దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో భీంగల్ పట్టణంలో ఆగస్టు 11న తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు సుదర్శన్ థియేటర్ వద్ద ర్యాలీ ప్రారంభమై సుమంగళి చౌరస్తా వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. భీంగల్ పట్టణ, మండల ప్రజలు, యువతీ యువకులు కులమతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “దేశం కోసం…..
నిజామాబాద్ నగర అభివృద్ధి పనులకు కేంద్రానికి ప్రతిపాదనలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్ రోడ్లు, వంతెనలు, కొత్త జాతీయ రహదారి కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్) నిజామాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక రోడ్లు, వంతెనలు, జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి…
మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
ధర్పల్లి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్లో “నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ స్పందన”లో భాగంగా ఓం శాంతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా…
ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం
మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు….

