Breaking News

కాంగ్రెస్ పాలనలో రైతు దగా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల బాకీ: వేముల

కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలను పునరుద్ధరించాలి యూరియా యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులు అందించాలి బాల్కొండలో భారీ రైతు సదస్సు.. వేలాది మంది రైతుల తరలింపు వేల్పూర్, సెప్టెంబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాత దగా, మోసానికి గురవుతున్నాడని…

Read More

నిజాంపేట్‌ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతల మెడకు చుట్టుకుంటుందా?

నిజాంపేట్‌ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్‌ నేతల మెడకు చుట్టుకుంటుందా? రూ.65 లక్షల హామీపై వివాదం.. 260 గజాల భూమి వ్యవహారంలో కీలక మలుపు మాజీ మేయర్‌ భర్త, స్థానిక కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నారా? బండారు లేఅవుట్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వాసు పాత్రపై తీవ్ర ఆరోపణలు హైదరాబాద్‌: నిజాంపేట్‌ సర్వే నంబర్‌ 94లోని సుమారు 260 గజాల భూమి వివాదం ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే దిశగా వెళ్తోందా?…

Read More

కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన

420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…

Read More

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నర్సయ్య, వీసీ…

Read More

రైతుల ప్రయోజనాలే పరమావధిగా.. సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులపై సమగ్ర సమీక్ష.. జాప్యానికి కారణాలు తెలుసుకుని, అడ్డంకులు తొలగించాలని ఆదేశం జుక్కల్, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి) రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులతో పాటు ఇతర నీటివనరుల పురోగతిని అధికారులను అడిగి…

Read More

సంక్షేమ హాస్టళ్లలో మేస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐపీఎస్‌యూ బోధన్, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి). సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే పెంచాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) డిమాండ్ చేసింది.AIPSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIPSU బోధన్ డివిజన్…

Read More

ఆర్టీసీ బస్సులో భద్రత గాలికేనా..?

బాన్సువాడ డిపో ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రమాదకర పరిస్థితులు TS16UC3338 బస్సు లో ఉన్న ప్రయాణికుల ఆందోళన.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్ ఆగస్టు 31:(E6tv NEWS: శివ ఠాకూర్). ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల్లోనే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాన్సువాడ డిపోకు చెందిన TS16UC3338 ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు కాలు పెట్టే ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయని,…

Read More

మానాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

మూడు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి: ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం విశాలమైన భవనంలోకి పాఠశాలను తరలిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం: వేముల ప్రశాంత్ రెడ్డి మానాల,ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) మానాల మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారుభవన…

Read More

ఇరిగేషన్ జాగా కబ్జాపై అధికారుల చర్యలు

కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేత స్థలం ఖాళీ చేయకపోతే రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కఠిన చర్యలు ఇరిగేషన్ ఏఈ రవికుమార్ హెచ్చరిక రుద్రూర్, ఆగస్టు 30:(E6tv NEWS ప్రతినిధి).నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఇరిగేషన్ శాఖ ఏఈ రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని…

Read More

ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన

నిర్మల్, ఆగస్టు 30: (E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట మోచి సంఘంలో ఎస్‌ఐఆర్ (SIR) ఫామ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్, బీఎల్‌ఓ ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఓటర్లు తమకు అందిన నోటీసుతో పాటు, పాత ఓటర్ జాబితా లేదా 2002…

Read More