E6TV Special Storys
it is exclusive Content for E6TV
కట్న వేధింపుల కేసులో భర్తకు మూడేళ్ల జైలు శిక్ష
బోధన్ కోర్టు సంచలన తీర్పు సెక్షన్ 498(A) కింద దోషిగా నిర్ధారణ రూ.500 జరిమానాతో పాటు 3 ఏళ్ల సాధారణ కారాగార శిక్ ఏడపల్లి పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం మద్దతు ఏడపల్లి, ఆగస్టు 5: (E6 tv NEWS, రవి నాయక్). కట్న వేధింపుల కేసులో బోధన్ గౌరవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఈ. సాయి శివ కీలక తీర్పు వెలువరించారు. వివాహ సమయంలో కట్నంగా నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నప్పటికీ, అనంతరం…
తెలంగాణలో ఫుడ్ అడల్టరేటర్లపై ఉక్కుపాదం.. ‘హైడ్రా’ తరహాలోనే ప్రత్యేక వింగ్ ఏర్పాటుకు సర్కార్ కసరత్తు!
హైదరాబాద్ : తెలంగాణలో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కల్తీ వ్యాపారుల నిర్మూలనకు కఠిన చట్టాన్ని తీసుకురావడంతో పాటు, ‘హైడ్రా’ (HYDRAA) లేదా ‘ఈగిల్’ (EAGLE) తరహాలో ఓ ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఆలోచిస్తోంది. ప్రత్యేక వింగ్, కఠిన చట్టాల దిశగా ప్రభుత్వం: హైదరాబాద్ పోలీసుల బిగ్ యాక్షన్ – ‘హత్యాయత్నం’ కేసులు: కల్తీకి పాల్పడే…
ఏర్గట్ల మండలంలో అక్రమ ఇసుక బహిరంగ వేలం
ఆగస్టు 7న తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహణ బట్టాపూర్లో స్వాధీనం చేసుకున్న 40 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక వేలానికి సిద్ధం ట్రిప్పుకు కనీస ధర రూ.2,000గా నిర్ణయం వేలంలో పాల్గొనాలంటే రూ.10,000 ధరావత్తు తప్పనిసరి వేలానికి ముందు ఇసుక నిల్వలను పరిశీలించే అవకాశం ఆసక్తి గల వారు ఆగస్టు 7 ఉదయం 11:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి హాజరు కావాలని సూచన ఏర్గట్ల, ఆగస్టు 5 (E6 tv న్యూస్ ప్రతినిధి).ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ఇటీవల…
సంగారెడ్డి, సదాశివపేటలో వైభవంగా బోనాల పండుగ!
సంగారెడ్డి: సంగారెడ్డి మరియు సదాశివపేట పట్టణాల్లో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బోనాల ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధాన అంశాలు:
మేనూర్లో రోడ్డు ఆక్రమణలు వెంటనే తొలగించాలి
ఆక్రమణల తొలగింపునకు నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ మద్నూర్, ఆగస్టు 4: E6 tv NEWS (M. మస్నాజీ)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం ఆదేశించింది. బస్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు రహదారి ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్ తెలిపారు. గ్రామంలోని ప్రధాన…
బస్ స్టాండ్ను ఆధునికీకరించాలి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇందూరు, ఆగస్టు 4: E6 tv NEWS ప్రతినిధి. నిజామాబాద్ నగర బస్ స్టాండ్ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ నగరానికి నూతన బస్ స్టాండ్ నిర్మాణం…
వన్నెల్ బిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలి.. ఆరు నెలల పాటు తల్లిపాలే ఉత్తమ ఆహారం: నిపుణులు బాల్కొండ, ఆగస్టు 4: E6 TV NEWS (తాటికొండ గంగాధర్)బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బక్కూరి వినోద ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమని, తొలి…
ప్రజల కోసం పనిచేయాలి.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవద్దు: ముత్యాల సునీల్ కుమార్
మెండోరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన.. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఇంచార్జ్ విమర్శలు మెండోర, ఆగస్టు 4: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.మంగళవారం మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ఆయన పరిశీలించారు. ఈ…
తైపీ-హైదరాబాద్-దుబాయ్ కార్గో కారిడార్ను ప్రారంభించిన జీఎంఆర్ శంషాబాద్ విమానాశ్రయం!
హైదరాబాద్: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA – శంషాబాద్) తూర్పు ఆసియా, భారతదేశం మరియు మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల మధ్య సరుకు రవాణాను (కార్గో) మరింత వేగవంతం చేయడానికి ‘ఎమిరేట్స్ స్కైకార్గో’ (Emirates SkyCargo) కి చెందిన ప్రత్యేక బోయింగ్ 777 ఫ్రైటర్ (Boeing 777F) సేవలను ప్రారంభించింది. ప్రధాన అంశాలు:
అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్లకు హరీష్ రావు డిఫమేషన్ నోటీసులు!
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు బిఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తానీరు హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. తనపై అసత్య, ద్యోతక వ్యాఖ్యలు చేసినందుకు గానూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన అంశాలు:

