E6TV Special Storys
it is exclusive Content for E6TV
ఖరీఫ్ 2026: తెలంగాణకు సరిపడా ఎరువుల సరఫరా.. పార్లమెంట్లో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ స్పష్టత!
హైదరాబాద్ / న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన స్థాయిలో ఎరువుల నిల్వలను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మెదక్ బిజెపి ఎంపీ ఎం. రఘునందన్ రావు లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ గురువారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 1 నుండి జులై 26 మధ్య కాలంలో రాష్ట్రంలో ఎరువుల లభ్యత అవసరాల కంటే అదనంగానే ఉందని, ఎక్కడా…
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లో అప్రెంటిస్ల నియామకాలు
ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఆగస్టు 1 నుంచి 10 వరకు NATS 2.0 పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచన నిజామాబాద్, జూలై 31: E6 tv NEWS( శివ ఠాకూర్). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ అవకాశాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని…
ఇంజనీరింగ్ విద్యపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు దారుణం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!
హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యను “క్రిమినల్ వేస్ట్” (Criminal Waste) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటమే కాకుండా రాష్ట్రంలోని విద్యార్థులను, యువతను తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. విద్యావ్యవస్థలోని లోపాలపై ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మక చర్చలు జరిపి మార్పులు తీసుకురావాల్సింది పోయి, విద్యార్థులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని కిషన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్లో ప్రధాన ముఖ్యాంశాలు:…
ముధోల్ శిశు మందిర్లో రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్కు సన్నాహాలు పూర్తి
ముధోల్, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ (విజ్ఞాన మేళా)ను ఆగస్టు 30, 31 మరియు సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్మల్ జిల్లా ముధోల్లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ తెలిపారు.ఈ సైన్స్ ఫేర్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శిశు మందిరాల నుంచి సుమారు 500…
బాసర ఐఐఐటీలో విద్యార్థి అదృశ్యం కలకలం.. నాందేడ్లో క్షేమంగా లభ్యం
బాసర, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ-ఐఐఐటీ)లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన యశ ఋషింద్ర రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కళాశాల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.విద్యార్థి తల్లిదండ్రులను సంప్రదించిన అనంతరం కళాశాల అధికారులు ఉదయం అతనికి అవుట్పాస్ మంజూరు చేశారు. అనంతరం యశ…
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్కు కేంద్రం సానుకూల స్పందన
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు – ప్రాజెక్ట్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ న్యూఢిల్లీ/నిర్మల్, జూలై 31 (E6TV): Md, అమీనుద్దీన్.ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్ను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు….
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు!
హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (e-KYC) నమోదు ప్రక్రియ ఆఖరి గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుండటంతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ జరుగుతుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ గడువును పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దీనితో పాటు…
ఉప్పొంగుతున్న గోదావరి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!
భద్రాచలం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం ఉదయం 10:45 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను (First Danger Warning) జారీ చేశారు. ఎగువన వర్షాల ఉధృతి కొనసాగుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ముంపు ప్రాంత ప్రజలను హెచ్చరించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వంతెన వద్ద ప్రవాహం ఏకంగా 9,32,288…
ఫార్ములా-ఈ రేసు కేసు: నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!
హైదరాబాద్: హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా-ఈ (Formula E) రేసు వ్యవహారంలో నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) శుక్రవారం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ (ACB) కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో అధికారిక విచారణ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఛార్జ్షీట్లో పేరున్న నిందితులందరూ విచారణ మొదటి రోజు నేరుగా కోర్టుకు హాజరుకావాలని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వుల మేరకు కేటీఆర్తో పాటు మాజీ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి…
ఆపదలో ఆపద్బాంధవుడిగా మాజీ ఉప సర్పంచ్ గడ్డం సుభాష్
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఉచిత వాహన సేవ ప్రకటింపు ముథోల్, జూలై 30: E6 tv NEWS(ఆకుల తిరుపతి గౌడ్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఉప సర్పంచ్, సామాజిక కార్యకర్త గడ్డం సుభాష్ నిర్ణయించారు. ప్రజా సేవే తన లక్ష్యమని పేర్కొంటూ, మండల కేంద్రం ముథోల్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన సమయంలో ఉచిత వాహన సేవ అందించేందుకు ఎల్లప్పుడూ…

