అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు: 8 మంది అరెస్ట్, 44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన ఐదుగురితో పాటు చోరీ బైకులను కొనుగోలు చేసిన ముగ్గురిని కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సిసిటివి (CCTV) ఫుటేజ్,…

