ఉప్పొంగుతున్న పెన్గంగా, ప్రాణహిత: నిలిచిపోయిన తెలంగాణ–మహారాష్ట్ర రోడ్డు రవాణా!
ఆదిలాబాద్ / నిర్మల్: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. పెన్గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జైనథ్ మండలంలోని ఆనంద్ పూర్ వంతెన పైనుంచి వరద నీరు పారుతోంది. దీనివల్ల తెలంగాణలోని జైనథ్కు, మహారాష్ట్రలోని దిగ్రాస్కు మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అయితే, జాతీయ రహదారి (NH-44) పై వాహనాల రాకపోకలకు ఎలాంటి విఘాతం కలగలేదు. వరద ఉధృతి నేపథ్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని…

