Breaking News

Shiv Thakur

కుంటాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు రూ.9 కోట్ల నిధులు

కుంటాల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). కుంటాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు….

Read More

పాల్వంచ మండల సమస్యలు పరిష్కరించాలి

36 గ్రామ పంచాయతీల సమస్యలపై ఎంపీడీవోకు బీఆర్‌ఎస్ వినతి పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం పాల్వంచ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో పాల్వంచ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం…

Read More

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొరకు అభినందనలు

పాల్వంచ, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్ డాక్టర్ దొరను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్–బాబు జగ్జీవన్‌రామ్ వారసుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.పాల్వంచతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దొర సేవలను ఐక్యవేదిక ప్రతినిధులు కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య…

Read More

శిరీష కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ

నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్‌లో ఇటీవల హత్యకు గురైన నర్స్ ఊకె శిరీష కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ములకలపల్లి మండలం చౌటిగూడెంలో శిరీష కుటుంబాన్ని కలిసి ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.శిరీష మృతిపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న కవిత.. ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శిరీషను హత్య…

Read More

HCA అండర్-16 జట్టుకు పాల్వంచకు చెందిన ముగ్గురు ఎంపిక

సృజంత్, దివాకర్, ప్రిన్స్‌కు చోటు పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచకు చెందిన నెక్స్ట్‌జెన్ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. అకాడమీ ఆటగాళ్లు సృజంత్, దివాకర్, ప్రిన్స్ ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించారు.HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తమ ప్రతిభను చాటుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు అండర్-16 జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారి…

Read More

సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రజల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 7 :(E6tv NEWS: ప్రతినిధి). పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు.సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)ను డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ…

Read More

విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన

బోధన్, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బోధన్‌లో ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ వివిధ తరగతుల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సత్య వర ప్రసాద్‌తో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి…

Read More

శిరీష హత్యాచార ఘటనపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం

రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం కొత్తగూడెం:, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి శిరీష హత్య, అత్యాచారం ఘటనపై కార్యాచరణ రూపొందించేందుకు సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా తెలిపారు.సోమవారం ఉదయం 11.30 గంటలకు కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్‌’లో రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు…

Read More

పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

జిల్లా వ్యాప్తంగా 1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు కొత్తగూడెం, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,030 మంది పరీక్షకు హాజరయ్యారు.అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షను ప్రశాంతంగా,…

Read More

పలువురి దశదినకర్మల్లో పాల్గొని సంతాపం తెలిపిన కొత్వాల

కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించిన కొత్వాల దంపతులు. పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ పట్టణ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ డైరెక్టర్‌, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, పాతపాల్వంచ 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొత్వాల విమలాదేవి ఆదివారం పరామర్శించారు. ఆయా కుటుంబాల్లో నిర్వహించిన దశదినకర్మలు, చిన్నకర్మ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాల్వంచకు చెందిన…

Read More