Breaking News

Shiv Thakur

నిజామాబాద్‌లో నూతన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఘన సన్మానం.

నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఇటీవల పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించిన డి. అరుణ్ కుమార్ ను టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ ప్రతినిధులు, శాఖా సిబ్బంది ఘనంగా సన్మానించారు. నిజామాబాద్‌లోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ కేంద్ర ఉపాధ్యక్షులు కె. అరుణ్ కుమార్, డీపీఈఓ (DPEO) కార్యాలయ ఏఏఓ వి. నరసయ్య పాల్గొని నూతన అసిస్టెంట్…

Read More

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం..?

చేయని నేరానికి జరిమానా విధించారని యువకుడి ఆరోపణ రైలు పట్టాలపై విషం తాగి ఆత్మహత్యాయత్నం.. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బోధన్, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ విధించిన జరిమానా, వేధింపుల కారణంగానే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెలువడ్డాయి. స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తాము చేయని నేరానికి…

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

ఎన్‌వోసీ జారీకి రూ.60 వేల లంచం డిమాండ్ – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆదిలాబాద్, జూలై 16: E6 న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో విజయవంతమైన దాడి నిర్వహించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్‌ను రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగేహస్తం పట్టుకున్నారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్…

Read More

గౌడ, యాదవ కులాలపై వ్యాఖ్యల వివాదం

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి: గౌడ జన హక్కుల పోరాట సమితి నిర్మల్, జూలై 16: E6 న్యూస్ తిరుపతి గౌడ్ గౌడ, యాదవ సమాజాలపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి…

Read More

లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

భవిత భవనం, కేజీబీవీ మౌలిక సదుపాయాలు, పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం – దివ్యాంగులకు పరికరాల పంపిణీ లోకేశ్వరం, జూలై 16: E6 న్యూస్, తిరుపతి గౌడ్. లోకేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత భవనంను ప్రారంభించి, దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సామగ్రి, ఇతర సహాయక పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నాబార్డ్…

Read More

విషమిచ్చి చిరుతపులిని హతమార్చిన ఇద్దరు అరెస్ట్

శరీర భాగాలను విక్రయించి డబ్బు సంపాదించాలన్న యత్నం.. మరో నలుగురు పరారీలో… భీంగల్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీంగల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని విషమిచ్చి హతమార్చిన ఘటనలో ఇద్దరిని అటవీశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖకు అందిన సమాచారం మేరకు కమ్మర్‌పల్లి రేంజ్ అధికారి కే. అనిత ఆధ్వర్యంలో అధికారులు…

Read More

ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్షతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు: డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి.

బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది – ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలో నెరవేరుస్తామని స్పష్టం నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష పేరుతో నాటకాలు…

Read More

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్  శివ ఠాకూర్ వచ్చే ఏడాది 2027 సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పుష్కర…

Read More

అబద్ధపు ప్రచారాలు మానేసి.. పెండింగ్ పనులు పూర్తి చేయాలి: భీంగల్ బీఆర్ఎస్ నాయకులు

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్ భీంగల్ పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్ డిపో, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అసత్య ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2022 జూన్ నెలలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి…

Read More

ఆధునిక నిర్మాణ సాంకేతికతతో నాణ్యమైన భవనాల నిర్మాణం

షేర్ వాల్ టెక్నాలజీతో మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలోనూ ఈ సాంకేతికత అమలుకు కృషి చేస్తామని వెల్లడి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ ఆధునిక నిర్మాణ రంగంలో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షేర్ వాల్ (Shear Wall) టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…

Read More