మహిళా బిల్లుపై బీజేపీ డ్రామాలు.. అమలులో ఉద్దేశపూర్వక ఆలస్యం: హైదరాబాద్ డీసీసీ చీఫ్ సైఫుల్లా ధ్వజం
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న తీరుపై హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారతపై బీజేపీ చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని కొట్టిపారేశారు.అమలుపై చిత్తశుద్ధి లేదు..2023 సెప్టెంబర్లోనే కాంగ్రెస్ మరియు ఇతర మిత్రపక్షాల మద్దతుతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, కేంద్రం దానిని అమలు చేయకుండా కాలయాపన…

