National
భీమ్గల్లో ఘనంగా తిరంగా ర్యాలీ
భీమ్గల్, ఆగస్టు 12: E6 tv NEWS(T. గంగాధర్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణంలో మంగళవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని సుదర్శన్ థియేటర్ నుంచి సుమంగళి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు, యువత, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పాటు శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల, శ్రీ నారాయణ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
CEIR పోర్టల్తో 8 సెల్ఫోన్లు రికవరీ
యజమానులకు ఫోన్లు అందజేసిన భీంగల్ పోలీసులు భీంగల్, ఆగస్టు 11: E6 tv NEWS (T. గంగాధర్).భీంగల్ మండల పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి రికవరీ చేశారు. మొత్తం 8 సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని సంబంధిత యజమానులకు అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు లేదా దరఖాస్తు చేయాలని పోలీసులు సూచించారు. ఫోన్ వివరాలను CEIR…
అభిమానంతో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర
మద్నూర్ మీదుగా తమిళనాడుకు వెళ్తున్న మహారాష్ట్ర అభిమాని యాదవ్ హెగ్డోలే మద్నూర్ ఆగస్టు 11: (E6 tv NEWS: M. మస్నాజీ).తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి పట్ల ఉన్న అభిమానంతో మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ మండలం షెల్గవ్ గ్రామానికి చెందిన యాదవ్ హెగ్డోలే తన అభిమాన నాయకుడిని స్వయంగా కలిసి అభినందించాలనే ఆశయంతో పాదయాత్రగా తమిళనాడు బయలుదేరారు. విజయ్ దళపతి ముఖ్యమంత్రి…
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. 40 కేసులు నమోదు
20 మంది అరెస్ట్.. గుడుంబా, అక్రమ మద్యం సీజ్రాబోయే వారం స్పెషల్ డ్రైవ్: DPEO అరుణ్ కుమార్ నిజామాబాద్, ఆగస్టు 11: (E6 tv NEWS: శివ ఠాకూర్).మత్తు పదార్థాల వినియోగం, అక్రమ విక్రయాలు, రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు DPEO పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్, మోర్తాడ్ ప్రాంతాలతో పాటు DTF, ఎన్ఫోర్స్మెంట్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 40 కేసులు నమోదు…
అస్సాంలో దారుణంగా మారిన వరద పరిస్థితి: 101కి చేరిన మృతుల సంఖ్య
గువాహటి: అస్సాం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, నిరంతర వరదల కారణంగా పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (DRIMS) తాజా సమాచారం ప్రకారం ఈ వరదల దాటికి బలియైన వారి సంఖ్య 101కి చేరుకుంది. పలు జిల్లాలు నీటమునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. కీలక వివరాలు:
అమెరికాలో ‘క్వాంటమ్స్కేప్’ హెడ్క్వార్టర్స్ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి.. నెక్స్ట్-జెన్ బ్యాటరీ భాగస్వామ్యంపై చర్చలు
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియా (శాన్ హోసే)లో ఉన్న ప్రముఖ బ్యాటరీ సాంకేతిక సంస్థ ‘క్వాంటమ్స్కేప్’ (QuantumScape) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తదుపరి తరం ‘సాలిడ్-స్టేట్ లిథియం-మెటల్’ బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధితో పాటు, భారత అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి మధ్య ఉండే భాగస్వామ్య అవకాశాలపై ఆయన క్వాంటమ్స్కేప్ ప్రెసిడెంట్ & సీఈఓ డాక్టర్ శివ శివరామ్, ఇతర సీనియర్ మేనేజ్మెంట్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. సమీక్ష సందర్భంగా, సంప్రదాయ…
భీంగల్లో అంగన్వాడీ ఉద్యోగుల ర్యాలీ.. రాస్తారోకో
భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్) దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీంగల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర…
ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీ ప్రారంభం
నిర్మల్, ఆగస్టు 10: (E6 tv NEWS (Md. అమీరుద్దీన్). నిర్మల్ పట్టణంలో ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించడంలో రక్త పరీక్షలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు…
బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
బాన్సువాడ ఆగస్టు 9: (E6 tv న్యూస్ ప్రతినిధి). యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, పండ్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత సమస్యల పరిష్కారం, నిరుద్యోగ నిర్మూలన, పేపర్ లీకుల నివారణ, ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతుల సమస్యల…
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి
మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరూ ఈ నెల 16వ తేదీన జరిగే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించాలని మద్నూర్ సర్పంచ్ సంతోష్ మేస్త్రి కోరారు.కందర్పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. మద్నూర్ మండల ప్రజలు కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు తరలివచ్చి కార్యక్రమాన్ని…

