News
డోంగ్లి ప్రధాన రహదారికి మరమ్మతులు
డోంగ్లి ఆగస్టు 13: (E6 tv NEWS, ప్రతినిధి). కామారెడ్డి జిల్లా డోంగ్లి గ్రామంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రహదారిపై ఏర్పడిన గుంతలను కాంక్రీట్ మిక్సర్ సహాయంతో మిశ్రమాన్ని పోసి పూడ్చే పనులు కొనసాగుతున్నాయి. ఈ మరమ్మతు పనులను డోంగ్లి తహసీల్దార్ రంజిత్ కుమార్ పరిశీలించారు. రహదారి మరమ్మతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, సక్రమంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రధాన రహదారికి మరమ్మతులు…
గోవింద్పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరు మహిళలు మృతిమరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, ఆగస్టు 13: (E6 tv NEWS, శివ ఠాకూర్). ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి…
అదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై విద్యార్థి యువత పోరు గర్జన
మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అదిలాబాద్ యూనిట్ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో ‘విద్యార్థి యువత పోరు గర్జన’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రధాన డిమాండ్లు మరియు ముఖ్యాంశాలు: ఈ సభలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాసిం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సాధన…
కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు హెల్త్ కార్డు వర్తింపజేయాలి
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పించాలి: టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో టీయూడబ్ల్యూజె హెచ్-143 జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ…
ఆర్మీ నియామకాల కోసం సైన్యంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ఆర్మీ అధికారులతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం తెలిపారు. స్థానిక యువతలో అవగాహన పెంచి, ఆర్మీ నియామకాల్లో వారు అర్హత సాధించేలా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయన సైనిక అధికారులకు విజ్ఞప్తి చేశారు. భారత సైనిక దళాల సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C) లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్…
నిరుపేద కుటుంబానికి అండగా జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్
జమ్మికుంట, ఆగస్టు 12: (E6 tv NEWS: ప్రతినిధి). ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సీర్ల అనిత రాణి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె అంతిమయాత్రలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ పాల్గొన్నారు.హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 30 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న సీర్ల అనిత రాణి ప్రైవేట్ నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని…
దివ్యాంగుల సంక్షేమంపై కేంద్ర మంత్రితో ఎంపీ అర్వింద్ భేటీ
న్యూఢిల్లీ ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్ను న్యూఢిల్లీలో కలిశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీల్చైర్లు, వినికిడి పరికరాలు,…
బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం
బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్…
అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు: 8 మంది అరెస్ట్, 44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన ఐదుగురితో పాటు చోరీ బైకులను కొనుగోలు చేసిన ముగ్గురిని కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సిసిటివి (CCTV) ఫుటేజ్,…
సీజనల్ వ్యాధులపై అవగాహనకు షార్ట్ఫిల్మ్ ఆవిష్కరణ
నిజామాబాద్ ఆగస్టు 12: E6 tv NEWS ( శివ ఠాకూర్).వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే షార్ట్ఫిల్మ్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆవిష్కరించారు.గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మానస ఆధ్వర్యంలో, ఉపాధ్యాయుడు కోకిల నాగరాజు రచించి, రూపొందించిన ఈ షార్ట్ఫిల్మ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే…

