Breaking News

ఐపీఎస్ రాజేష్ చంద్రకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి ఆహ్వానం మర్యాదపూర్వకంగా ఆహ్వానాన్ని స్వీకరించిన ఐపీఎస్ రాజేష్ చంద్ర కామారెడ్డి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఐపీఎస్ అధికారి శ్రీ రాజేష్ చంద్రను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఐపీఎస్ రాజేష్ చంద్ర…

Read More

భీంగల్ బస్టాండ్‌లో కంట్రోలర్ పోస్టు ఖాళీ.. ప్రయాణికుల ఇబ్బందులు

హోంగార్డుతో నిర్వహణపై ప్రజల అసంతృప్తి భీంగల్ బస్టాండ్‌కు శాశ్వత కంట్రోలర్‌ను నియమించాలని డిమాండ్ భీంగల్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ బస్టాండ్‌లో ఆర్టీసీ కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంట్రోలర్ స్థానంలో డిపోలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డును బస్టాండ్‌కు నియమించడంతో ప్రయాణికులకు సరైన సమాచారం అందడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, భీంగల్ బస్టాండ్ నుంచి వేల్పూర్, బోధన్,…

Read More

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం

ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి: టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహణకు యూఎస్‌పీసీ నిర్ణయం ఏర్గట్ల, ఆగస్టు 7: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్). ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమాలను చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఏర్గట్ల మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో…

Read More

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

కొత్త అప్రోచ్ రోడ్లు, MRR, CRR, హ్యామ్ రోడ్ల పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచన నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్ ) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా….

Read More

మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

ధర్పల్లి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్‌లో “నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ స్పందన”లో భాగంగా ఓం శాంతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా…

Read More

మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల మంజూరు

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత ప్రభుత్వం రూ.32 లక్షలు – గ్రామస్థుల విరాళం రూ.8 లక్షలు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్).నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కృషితో డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల…

Read More

కమిషన్ల కోసమే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించారు: కాంగ్రెస్ ఆరోపణ

ఏర్గట్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి హయాంలో నాణ్యత లేని నిర్మాణాలు జరిగాయని విమర్శ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు 500 ఇళ్ల మంజూరు జరిగిందని వెల్లడి మరో 500 ఇళ్లను మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఏర్గట్ల, ఆగస్టు 6: (E6 tv NEWS, ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ…

Read More

నందిపేట్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

స్థానిక అధికారులతో కలిసి స్థల పరిశీలన క్రీడా స్థలానికి అనువైన భూమిని గుర్తించాలని ఆదేశం చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన బఫర్ జోన్‌లోని వెంచర్ల అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశం బఫర్ జోన్‌లోని వెంచర్ల అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశం మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నందిపేట్, ఆగస్టు 7: E6 tv NEWS (శివ ఠాకూర్)నందిపేట్ మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఏర్పాటుకు…

Read More

గంటల్లోనే అదృశ్యమైన బాలుడి ఆచూకీ

కమ్మర్పల్లి పోలీసుల చాకచక్యానికి ప్రజల ప్రశంసలు కమ్మర్పల్లి, ఆగస్టు 6: (E6 tv NEWS. ప్రతినిధి) కమ్మర్పల్లి పోలీసుల సమర్థవంతమైన చర్యలతో అదృశ్యమైన ఓ బాలుడిని గంటల వ్యవధిలోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానిక ప్రజలు, బాలుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు సిబ్బందిని అభినందించారు. కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15) గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన…

Read More

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం

మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు….

Read More