Nizambad
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1 లక్ష ఎల్ఓసీ అందజేత
అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్నకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ, ఆగస్టు 3: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సాట్లపల్లి రాజన్న (తండ్రి: గంగారం) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సిందిగా సూచించడంతో కుటుంబ సభ్యులు వైద్య సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను సంప్రదించారు.విషయాన్ని…
బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి 10 కీలక ప్రతిపాదనలు
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించిన…
అనారోగ్యంతో బాధపడుతున్న వార్డు సభ్యుడు బాబును పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నిజాంసాగర్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ పరిధికి చెందిన 10వ వార్డు సభ్యుడు బాబు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి…
గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని హండె కేలూర్ గ్రామస్తుల వినతి
మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండె కేలూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామానికి కొత్త కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రంలో గ్రామస్తులు పేర్కొన్న వివరాల ప్రకారం, బీసీ కాలనీలో గడ్డివార్ వీరేశంకు అక్రమ నిర్మాణం పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారని తెలిపారు. అయితే అదే ప్రాంతంలో తాము గత 20 ఏళ్లుగా…
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాల పంపిణీ
జుక్కల్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ). కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోడ గడియారాలను సోమవారం పంపిణీ చేశారు.జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఈ గోడ గడియారాలను అందజేసినట్లు గ్రామ సర్పంచ్ వి. రమణా సురేష్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా…
నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలి: జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
కామారెడ్డి, ఆగస్టు 3: E6 tv NEWS (ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నేరాల నివారణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు…
భీంగల్లో ఘనంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
భీంగల్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం భీంగల్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్…
ఏర్గట్లలో ఘనంగా సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఏర్గట్ల, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి, టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేసి, సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు…
వరద కాలువ తూమ్లు తెరిచి చెరువులు నింపాలి: బీఆర్ఎస్ డిమాండ్
రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించిన ఘనత కేసీఆర్, ప్రశాంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్య మోర్తాడ్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). కాలేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా కమర్పల్లి–మోర్తాడ్ మండలాల సరిహద్దులోని వరద కాలువలోకి గోదావరి జలాలు చేరడం పట్ల ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కమర్పల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్ తెలిపారు. తిమ్మాపూర్ వరద కాలువ బ్రిడ్జి వద్ద…
ఆగస్టు 18లోపు గౌడలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ ఆగస్టు 2: E6 tv NEWS (A,తిరుపతి గౌడ్). జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడంతో పాటు ఎన్నికల సమయంలో గౌడ సమాజానికి ఇచ్చిన హామీలన్నింటినీ ఆగస్టు 18లోపు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి – మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సా గౌడ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆగస్టు 24 నుంచి…

