Breaking News

బీఆర్ఎస్‌లో భారీ చేరికలు

కారెక్కిన సీపీఐ సీనియర్ నేత కిలారు ప్రసాద్ పాత కొత్తగూడెం 11వ డివిజన్ నుంచి సుమారు 100 మంది కార్యకర్తల చేరిక 100 మోటార్‌సైకిళ్లతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కొత్తగూడెం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీలో బుధవారం భారీగా చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్‌ గ్రామపంచాయతీకి చెందిన సీపీఐ సీనియర్‌ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ పాత…

Read More

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమరా ప్రసాద్‌ను అరెస్ట్ చేయాలి

పాల్వంచలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఐక్య సంఘాల నిరసన రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను అవమానిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిక పాల్వంచ, సెప్టెంబర్‌ 9:(E6tv NEWS: ప్రతినిధి). రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అమరా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ ఐక్య సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పాల్వంచలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద బహుజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిరసన…

Read More

సివిల్స్‌ కొట్టే ఛాన్స్‌.. ఉచిత శిక్షణకు గ్రీన్‌సిగ్నల్‌!

రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ రూ.3 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక.. ఈ నెల 23లోగా దరఖాస్తు భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ…

Read More

సివిల్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి).  సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ అందించేందుకు రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్‌ తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు….

Read More

ప్రజా సమస్యలు వదిలేసి BRS అసెంబ్లీని అడ్డుకుంటోంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి

హైదరాబాద్: గత మూడు రోజులుగా తెలంగాణ శాసనసభా వ్యవహారాలను ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు నిరంతరం అడ్డుకోవడాన్ని “విచారకరం” అని నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభను దారి మళ్లించేందుకు ప్రతిపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని బుధవారం ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ప్రధాన విమర్శలు

Read More

ప్రజా సమస్యలను వదిలేసి అసెంబ్లీని కక్ష సాధింపులకు వేదికగా మార్చారు…

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణ తీరుపై ప్రతిపక్షం భారత్ రాష్ట్ర సమితి (BRS) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాల్సిన పవిత్రమైన సభను, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చిందని తీవ్ర స్థాయిలో ఆరోపించింది. మూడు రోజుల పరిణామాలు – బీఆర్ఎస్ ఆరోపణలు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన మూడు రోజుల పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు: ప్రజా సమస్యలపై ప్రభుత్వం మౌనం రాష్ట్రంలో…

Read More

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి

గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయాలి హుజూర్‌నగర్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ హుజూర్‌నగర్ పట్టణ జర్నలిస్టులు తహసీల్దార్ బండా కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కమిషనర్ కే. సతీష్‌లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే…

Read More

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసిన వి. పార్వతి హాథీరామ్ నాయక్

భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి. పార్వతి హాథీరామ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను శాలువా, బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన రైతులకు రావాల్సిన పోడు…

Read More

BRS కార్యకర్తపై దాడి.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

పిట్లం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన BRS కార్యకర్త శివపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దాడిలో గాయపడిన శివకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తారని…

Read More

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

నిజామాబాద్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజల…

Read More