Breaking News

తండ్రికి తగ్గ తనయుడు… ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పోచారం భాస్కర్ రెడ్డి.

కోటగిరి, జూలై 19: E6 tv NEWS (శివ ఠాకూర్).బాన్సువాడ నియోజకవర్గ రాజకీయాల్లో యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న పోచారం భాస్కర్ రెడ్డి పేరు ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు లభిస్తోందని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ప్రజలతో మమేకమవడం, అవసరమైన సమయంలో అండగా నిలవడం, ఎక్కువగా మాటలు…

Read More

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి కాలం చెల్లిన మందులా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్.

ఒక నెల మందులు ఇవ్వగా 22 రోజుల పాటు వాడినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ తప్పు జరిగిందని వైద్య సిబ్బంది క్షమాపణ చెప్పారని సీతారాం వాదన తల్లి, శిశువుకు ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి రుద్రూర్ జులై 19: E6tv NEWS (అశోక్ కాంబ్లే). నిజామాబాద్ జిల్లా రుద్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి కాలం చెల్లిన మందులు ఇచ్చారంటూ…

Read More

ఈశాన్య తెలంగాణలో నేడు విస్తృత వర్షాలు

నిజామాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – హైదరాబాద్‌లో సాయంత్రం జల్లులు నిజామాబాద్, జూలై 19: E6 tv NEWS. రాష్ట్రంలో నేడు (జూలై 19) ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల,…

Read More

రణభేరి కాదు.. రాద్ధాంత భేరి: బీజేపీ, బీఆర్ఎస్‌పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి విమర్శలు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్‌ఎస్ బకాయిలను కాంగ్రెస్‌పై నెట్టివేయడం రాజకీయ దివాళాకోరుతనం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే పిలుపు నిజామాబాద్, జూలై 18 (E6 tv NEWS ప్రతినిధి): బీజేపీ చేపట్టిన కార్యక్రమం “రణభేరి” కాదని, అది కేవలం “రాద్ధాంత భేరి” మాత్రమేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విమర్శించారు. విద్యార్థుల సంక్షేమం పేరుతో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం…

Read More

నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చోరీ బైక్, బంగారు గొలుసుతో నిందితుడు పట్టివేత.

నిజామాబాద్, జూలై 18 : E6 tv NEWS (శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్‌లో చోరీకి గురైన మోటార్ సైకిల్‌తో పాటు బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం ట్రాఫిక్…

Read More

తానూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం

రూ.98.12 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తానూర్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నాబార్డ్ (NABARD) నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులను, అలాగే రూ.42.12 లక్షలతో ఏర్పాటు చేసిన…

Read More

బాసర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం.. 2,500 ఎకరాలకు సాగునీటి శుభవార్త

రైతులకు మేలు చేసే దిశగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చర్యలు బాసర, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్).స్వల్ప వర్షాలతో సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న బాసర మండల రైతులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుభవార్త అందించారు. బాసర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని శనివారం ప్రారంభించిన ఆయన, ఈ పథకం ద్వారా బాసర పరిసర ప్రాంతాల్లో సుమారు 2,500 ఎకరాల సాగుభూమికి నీరందుతుందని తెలిపారు. దీంతో రైతులు పంటల సాగును సకాలంలో…

Read More

క్షేత్ర సందర్శనతో విద్యార్థులకు పోస్టల్ సేవలపై అవగాహన

ముధోల్ పోస్టాఫీసును సందర్శించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ 4వ తరగతి విద్యార్థులు ముధోల్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)విద్యార్థులకు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో బోధించాలనే ఉద్దేశ్యంతో ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థులు శనివారం స్థానిక పోస్టాఫీసును క్షేత్రస్థాయిలో సందర్శించారు. విజ్ఞానశాస్త్రం బోధనలో భాగంగా నిర్వహించిన ఈ విద్యా పర్యటనలో విద్యార్థులు పోస్టాఫీసు పనితీరు, ప్రజలకు అందిస్తున్న వివిధ పోస్టల్ సేవలను…

Read More

18 ఏళ్లుగా ఇందూరు జిల్లాను ఎడారిగా మార్చింది కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే: దినేష్ పటేల్ కులాచారి

సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శ – రైతులను మోసం చేస్తే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలకు హెచ్చరిక నిజామాబాద్, జూలై 18: E6 tv NEWS (శివ ఠాకూర్). గత 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇందూరు జిల్లా ఎడారిగా మారుతోందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆరోపించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

Read More