Telangana
గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్ఎమ్సి కమిషనర్
హైదరాబాద్లోని మన్సూర్ బాద్ ‘బేబీ పాండ్’ (కృత్రిమ చెరువు) వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కమిషనర్ టి. వినాయ్ కృష్ణారెడ్డి మంగళవారం (సెప్టెంబర్ 8, 2026) ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిమజ్జన ప్రక్రియను వేగంగా, సురక్షితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమైన ఆదేశాలు & ఏర్పాట్లు: ఈ సందర్భంగా పర్యావరణ అనుకూల విధానాలతో, భక్తులకు సురక్షితమైన నిమజ్జన అనుభవాన్ని…
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి
మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులు భూ పత్రాలు, హద్దులు చూపించి సహకరించాలి పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నంబర్ 77లో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రోవర్ పరికరాల సహాయంతో భూములను కొలుస్తున్న విధానం, క్షేత్రస్థాయిలో…
గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గణేష్ మండపాల నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే ముందు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో…
ఎమ్మెల్యేలతో హత్య రాజకీయాలా?: వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం!
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను అంతమొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చావును కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన… షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డి విమర్శల్లోని ముఖ్యాంశాలు:
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష
ఆరోగ్య సూపర్వైజర్లకు డీఎంహెచ్ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచనలు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్ఓ, కొత్తగూడెం కార్యాలయ సమావేశ మందిరంలో ఆరోగ్య సూపర్వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. తుకారామ్ రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ భూక్యా రామ్ దాస్, డాక్టర్ టీ. ప్రతాప్, డాక్టర్ దినేష్, సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష
అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణి, గ్రూప్-1 అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత…
ఎన్నికల హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ను వదలం
కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన పాల్వంచ, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆ పార్టీని వదిలేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్…
తిరస్కరించిన ఓట్లను పునరుద్ధరించుకోవాలి
పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో తిరస్కరించబడిన ఓట్లను పునరుద్ధరించుకోవాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, డీసీఎస్ఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. పాత పాల్వంచలోని 78, 79, 80, 81 పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్లతో బీఎల్ఓలు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. ఓటు హక్కు…
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
అంగన్వాడి టీచర్ అక్రమ అరెస్టులను ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు ఏర్గట్ల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). అంగన్వాడి టీచర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్బాబు అన్నారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మంగళవారం డిచ్పల్లి, ఇందల్వాయి పోలీస్…
మేడ్చల్ వద్ద కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్!
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్హౌస్కు బయలుదేరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ నేతలు రోడ్డుపైనే బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని బోయిన్పల్లి, జవహర్నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రంగంలో ఏం జరిగింది?:

