Telangana
బోడుప్పల్ భూ పోరాటం సందర్భంగా తెలంగాణ రక్షక సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్ట్
బోడుప్పల్, జూలై 2: బోడుప్పల్లో నిర్వహించిన భూపోరాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూపోరాటం సందర్భంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు…
మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ శివ ఠాకూర్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ మరియు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో, TOMCOM సౌజన్యంతో గురువారం నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తా జనార్దన్ గార్డెన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన నగర మేయర్ ఉమారాణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన…
ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీస్ చేయాలి: తెలంగాణ విద్యార్థి పరిషత్.
బోధన్, జూలై 2: E6 న్యూస్ ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేసి, విద్యార్థుల ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోధన్ ఆర్టీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ, బోధన్ పట్టణంలోని యూనిక్ హై స్కూల్కు చెందిన AP20TB6907 నంబర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బండారుపల్లి–శ్రీనివాస్ క్యాంప్…
విద్యా సంస్థలపై దాడులు, బందులకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు: CP సాయి చైతన్య.
నిజామాబాద్, జూలై 2: నిజామాబాద్. (E6 క్రైమ్ న్యూస్- శివ ఠాకూర్) విద్యాసంస్థలపై దాడులు చేయడం, యాజమాన్యాన్ని బెదిరించడం, విద్యాసంస్థల బంద్లకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో కొన్ని విద్యార్థి సంఘాల పేరుతో వ్యక్తులు పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతి లేకుండా…
ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల వివాదం… ఏబీవీపీ ఆందోళన, ఎం ఈ ఓ విచారణ.
చందూరు, జూలై 2:(E6 న్యూస్- ఔరాద్ అశోక్)నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల నిల్వ, విక్రయాల అంశం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలోనే పుస్తకాలను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పాఠశాలకు వెళ్లి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుల కథనం ప్రకారం, పాఠశాలలోని ఓ గదిలో పెద్ద మొత్తంలో పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన…
ప్రభుత్వ భూమి కబ్జాయత్నంపై గ్రామస్తుల ఆందోళన, పోతంగల్ హంగర్గా ఫారంలో ఉద్రిక్తత.
పొతంగల్, జూలై 2:(E6 న్యూస్: ఔరాద్ అశోక్) నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని హంగార్గా ఫారం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం జరిగిందంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు ఏకమై నిలిచామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం, గైక్వాడ్ భీమ్రావు అనే వ్యక్తి తన వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ట్రాక్టర్తో దున్నించి ఆక్రమించుకునే ప్రయత్నం…
ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల వివాదం, ఏబీవీపీ ఆందోళన, ఎంఈఓ విచారణ
చందూరు, జూలై 2:నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల నిల్వ, విక్రయాల అంశం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలోనే పుస్తకాలను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పాఠశాలకు వెళ్లి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుల కథనం ప్రకారం, పాఠశాలలోని ఓ గదిలో పెద్ద మొత్తంలో పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఆర్పీని…
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ XII ప్రారంభం
నిజామాబాద్, జూలై 2:(E6 క్రైమ్-శివ ఠాకూర్) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజులపాటు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తప్పిపోయిన చిన్నారులు, నిరాశ్రయ బాలలు, వీధి…
మాదిగల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తాం: డా,పేరుమాండ్ల రామకృష్ణ
నిజామాబాద్, జూలై 1: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్డీ) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్ & బి గెస్ట్ హౌస్లో సంస్థ ముఖ్య సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి సంస్థను బలోపేతం చేయడం, మాదిగ సమాజ హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని విస్తరించడంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల…
E6 న్యూస్ కథనానికి స్పందన, అనుమతులు లేని ఆసుపత్రి పై DMHO అధికారుల చర్యలు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి మరి. నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే గత రెండేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రికి సంబంధించిన బోర్డులు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య స్థానికంగా…

