Breaking News

పనివాళ్లను చేర్చుకునే ముందు ‘పోలీస్ వెరిఫికేషన్’ తప్పనిసరి: హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ హెచ్చరిక!

హైదరాబాద్: ఇళ్లల్లో, వ్యాపార సంస్థల్లో పనిమనుషులు (Domestic Workers/Employees) చేసే దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలను, యజమానులను అప్రమత్తం చేశారు. పనివాళ్లను నియమించుకునే ముందు తప్పనిసరిగా వారి వివరాలను సేకరించి, పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ (Police Verification) చేయించాలని ఆయన స్పష్టం చేశారు. యజమానుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని సీపీ వివరించారు. సీపీ హెచ్చరికలు & కీలక వివరాలు: ప్రతి ఒక్కరి భద్రత దృష్ట్యా,…

Read More

సర్కారీ బడుల చేరికల్లో ‘మంచిర్యాల’ భేష్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం!

మంచిర్యాల: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను (ఎన్‌రోల్‌మెంట్) పెంచే లక్ష్యంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి రికార్డు సృష్టించింది. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10 శాతం అదనపు చేరికలు సాధించాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో మంచిర్యాల ఏకంగా 95.72 శాతం ప్రగతిని సాధించింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య జులై 25న విడుదల చేసిన ‘యు-డైస్’ (U-DISE) పోర్టల్ నివేదిక ద్వారా ఈ…

Read More

తెలంగాణలో 1.05 కోట్ల కుటుంబాలకు ‘స్మార్ట్ రేషన్ కార్డ్స్’.. ఆగస్టులో పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం!

హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ (QR Code) సదుపాయంతో కూడిన కొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డ్’లను అందుబాటులోకి తేనుంది. ఈ కార్డుల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, జిల్లాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఆగస్టు మొదటి వారంలో లేదా ఆగస్టు 15…

Read More

శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో విషాదం

నలుగురు యువకులు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం – మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య – వర్షాకాలంలో జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి నిజామాబాద్, జూలై 26: E6 tv NEWS: శివ ఠాకూర్. ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని లక్ష్మి కెనాల్‌లో ఆదివారం చోటుచేసుకున్న విషాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విహారయాత్రకు వెళ్లిన…

Read More

లింబాద్రిగుట్టలో హైకోర్టు న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న న్యాయమూర్తులు – కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు భీంగల్, జూలై 26: (E6 tv NEWS: T, గంగాధర్) భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మణ్ నారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి ఆలయానికి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

Read More

పి.ఆర్.సి. బకాయిలు వెంటనే చెల్లించాలి

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల వినతి భైంసా, జూలై 26: (E6 tv NEWS: తిరుపతి గౌడ్) రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు, పెండింగ్ అలవెన్సులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు రావాల్సిన పి.ఆర్.సి. బకాయిలు,…

Read More

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో విషాదం

నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగింపు నిజామాబాద్, జూలై 26: (E6 tv NEWS). నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు నీటిలో నలుగురు విద్యార్థులు మునిగిపోగా, వారిలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. మరో ఇద్దరు విద్యార్థులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ…

Read More

కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత

కేంద్రమంత్రి రాజీనామాతో సరిపోదు.. పేపర్ లీకేజీల నివారణకు వ్యవస్థాగత సంస్కరణలు అవసరం: కల్వకుంట్ల కవిత NTAకు UPSC తరహాలో స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్ విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని సూచన జూలై 26: E6 tv NEWS శివ ఠాకూర్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం…

Read More

ముధోల్ డిగ్రీ కళాశాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషి ఫలితమే: ప్రిన్సిపాల్, అధ్యాపకుల కృతజ్ఞతలు స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానున్న అధ్యయన కేంద్రం ముధోల్, జూలై 25: (E6 tv NEWS:తిరుపతి గౌడ్)ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ) అధ్యయన కేంద్రంగా ఎంపిక చేయడం పట్ల విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ముధోల్‌తో పాటు పరిసర…

Read More

నిక్షయ మిత్రలుగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల నమోదు చేపట్టాలి

టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరం: డీఎంహెచ్‌ఓ డా. బి. రాజశ్రీ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS: శివ ఠాకూర్).జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న టీబీఎంబీఏ (TBMBA) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి మండలం నుంచి ఐదుగురు ఎన్సీసీ (NCC), ఎన్ఎస్ఎస్ (NSS) విద్యార్థులను నిక్షయ మిత్రలుగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి…

Read More