Breaking News

మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

ధర్పల్లి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్‌లో “నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ స్పందన”లో భాగంగా ఓం శాంతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా…

Read More

డాక్టర్ ఎంసీఆర్ ‘టిమ్స్’లో త్వరలోనే పూర్తిస్థాయి వైద్యసేవలు.. ఏర్పాట్లను వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం!

హైదరాబాద్ (E6TV News): హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Dr MCR TIMS) ఆసుపత్రిలో ప్రజలకు త్వరలోనే పూర్తిస్థాయి సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ట్రయల్ రన్ (Trial Run) వైద్యసేవలు, మౌలిక వసతులు, నియామకాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలోని కీలక ఆదేశాలు:…

Read More

నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత.. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్ (E6TV News): జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వారసత్వం మన చేనేత కళ అని ఆయన కొనియాడారు. సీఎం సందేశంలోని ముఖ్యాంశాలు: చేనేత కార్మికుల కష్టపడే తత్వానికి, అద్భుతమైన సృజనాత్మకతకు తగిన గౌరవం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read More

సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1.. టీజీసీఎస్‌బీ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!

హైదరాబాద్ (E6TV News): సైబర్ నేరాల అదుపు మరియు బాధితులకు తక్షణ న్యాయం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) గురువారం నిర్వహించిన జాతీయ స్థాయి ‘ప్రగతి’ (PRAGATI) సమీక్షా సమావేశంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్…

Read More

మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల మంజూరు

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత ప్రభుత్వం రూ.32 లక్షలు – గ్రామస్థుల విరాళం రూ.8 లక్షలు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్).నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కృషితో డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల…

Read More

కమిషన్ల కోసమే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించారు: కాంగ్రెస్ ఆరోపణ

ఏర్గట్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి హయాంలో నాణ్యత లేని నిర్మాణాలు జరిగాయని విమర్శ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు 500 ఇళ్ల మంజూరు జరిగిందని వెల్లడి మరో 500 ఇళ్లను మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఏర్గట్ల, ఆగస్టు 6: (E6 tv NEWS, ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ…

Read More

నందిపేట్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

స్థానిక అధికారులతో కలిసి స్థల పరిశీలన క్రీడా స్థలానికి అనువైన భూమిని గుర్తించాలని ఆదేశం చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన బఫర్ జోన్‌లోని వెంచర్ల అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశం బఫర్ జోన్‌లోని వెంచర్ల అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశం మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నందిపేట్, ఆగస్టు 7: E6 tv NEWS (శివ ఠాకూర్)నందిపేట్ మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఏర్పాటుకు…

Read More

గంటల్లోనే అదృశ్యమైన బాలుడి ఆచూకీ

కమ్మర్పల్లి పోలీసుల చాకచక్యానికి ప్రజల ప్రశంసలు కమ్మర్పల్లి, ఆగస్టు 6: (E6 tv NEWS. ప్రతినిధి) కమ్మర్పల్లి పోలీసుల సమర్థవంతమైన చర్యలతో అదృశ్యమైన ఓ బాలుడిని గంటల వ్యవధిలోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానిక ప్రజలు, బాలుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు సిబ్బందిని అభినందించారు. కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15) గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన…

Read More

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం

మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.వక్తలు మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను నేటి తరానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు….

Read More

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

మద్నూర్ సబ్‌స్టేషన్‌లో వినియోగదారుల నుంచి వినతుల స్వీకరణ మద్నూర్, ఆగస్టు 6: (E6 tv NEWS M. మస్నాజీ) మద్నూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్, బిచ్కుంద, డోంగ్లి, జుక్కల్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు అందజేశారు.విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, కొత్త కనెక్షన్లు, తక్కువ వోల్టేజ్, బిల్లింగ్ తదితర అంశాలపై వినియోగదారులు తమ…

Read More