E6TV Special Storys
it is exclusive Content for E6TV
భీంగల్ బస్టాండ్లో కంట్రోలర్ పోస్టు ఖాళీ.. ప్రయాణికుల ఇబ్బందులు
హోంగార్డుతో నిర్వహణపై ప్రజల అసంతృప్తి భీంగల్ బస్టాండ్కు శాశ్వత కంట్రోలర్ను నియమించాలని డిమాండ్ భీంగల్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ బస్టాండ్లో ఆర్టీసీ కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంట్రోలర్ స్థానంలో డిపోలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డును బస్టాండ్కు నియమించడంతో ప్రయాణికులకు సరైన సమాచారం అందడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, భీంగల్ బస్టాండ్ నుంచి వేల్పూర్, బోధన్,…
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి: టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ ఆగస్టు 29న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహణకు యూఎస్పీసీ నిర్ణయం ఏర్గట్ల, ఆగస్టు 7: (E6 tv NEWS, తాటికొండ గంగాధర్). ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమాలను చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఏర్గట్ల మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో…
అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
కొత్త అప్రోచ్ రోడ్లు, MRR, CRR, హ్యామ్ రోడ్ల పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచన నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్ ) నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా….
4వ తరగతి విద్యార్థికి ‘అక్షరాలు’ రాకవడమేంటి?.. ఉపాధ్యాయులపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆగ్రహం!
భద్రాద్రి కొత్తగూడెం (E6TV News): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పాకాలగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల తీరుపై అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, విద్యార్థుల అభ్యాస స్థాయిలను పరిశీలించేందుకు వారితో ముఖాముఖి సంభాషించారు. పాఠశాల తనిఖీలో వెలుగుచూసిన ప్రధాన అంశాలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జోగిపేట ఏరియా ఆస్పత్రి డాక్టర్ సస్పెన్షన్.. ప్రైవేట్ డెంటిస్ట్తో వైద్యం చేయించినందుకు దామోదర రాజనర్సింహ చర్యలు!
హైదరాబాద్ / జోగిపేట (E6TV News): ప్రభుత్వ ఆసుపత్రికి డ్యూటీకి హాజరుకాకుండా తన స్థానంలో ఓ ప్రైవేట్ దంత వైద్యుడితో (Dentist) రోగులకు పరీక్షలు చేయించిన తీవ్ర నిర్లక్ష్య ఉదంతంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘాటుగా స్పందించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రికి చెందిన డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్) డాక్టర్ రమేష్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగింది? సూపరింటెండెంట్పై డిపార్ట్మెంటల్ యాక్షన్:…
మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
ధర్పల్లి, ఆగస్టు 7: (E6 tv NEWS ప్రతినిధి). విద్యార్థి దశ నుంచే మత్తు పదార్థాలు, మద్యం, పొగాకు, డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్లో “నషా ముక్త్ భారత్ అభియాన్–మిషన్ స్పందన”లో భాగంగా ఓం శాంతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా…
డాక్టర్ ఎంసీఆర్ ‘టిమ్స్’లో త్వరలోనే పూర్తిస్థాయి వైద్యసేవలు.. ఏర్పాట్లను వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం!
హైదరాబాద్ (E6TV News): హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Dr MCR TIMS) ఆసుపత్రిలో ప్రజలకు త్వరలోనే పూర్తిస్థాయి సూపర్స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ట్రయల్ రన్ (Trial Run) వైద్యసేవలు, మౌలిక వసతులు, నియామకాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలోని కీలక ఆదేశాలు:…
నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత.. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ (E6TV News): జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వారసత్వం మన చేనేత కళ అని ఆయన కొనియాడారు. సీఎం సందేశంలోని ముఖ్యాంశాలు: చేనేత కార్మికుల కష్టపడే తత్వానికి, అద్భుతమైన సృజనాత్మకతకు తగిన గౌరవం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల మంజూరు
ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత ప్రభుత్వం రూ.32 లక్షలు – గ్రామస్థుల విరాళం రూ.8 లక్షలు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక నిజామాబాద్, ఆగస్టు 7: (E6 tv NEWS, శివ ఠాకూర్).నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కృషితో డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షల…
కమిషన్ల కోసమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు: కాంగ్రెస్ ఆరోపణ
ఏర్గట్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి హయాంలో నాణ్యత లేని నిర్మాణాలు జరిగాయని విమర్శ ప్రజా ప్రభుత్వంలో అర్హులకు 500 ఇళ్ల మంజూరు జరిగిందని వెల్లడి మరో 500 ఇళ్లను మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఏర్గట్ల, ఆగస్టు 6: (E6 tv NEWS, ప్రతినిధి).ఏర్గట్ల మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ…

