Breaking News

ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఊరుకోం

బీజేపీ కార్పొరేటర్ల హెచ్చరిక నిజామాబాద్ ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్) నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవని 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ హెచ్చరించారు.జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రం సుధీర్, 22వ డివిజన్ కార్పొరేటర్ సాయి వైష్ణవి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగినన్ని…

Read More

పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు

నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…

Read More

ఆహార, ఔషధ భద్రతకు ప్రాధాన్యత: ‘TG-SAFE’ ప్రాముఖ్యతను వివరించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజల ఆరోగ్యం, ఆహారం మరియు మందుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిన ‘TG-SAFE’ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్) అమలులోకి వచ్చిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం వెల్లడించారు. పౌరులందరి క్షేమం మరియు రక్షణే ధ్యేయంగా ఈ ఏకీకృత వ్యవస్థను తీసుకొచ్చామని, సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు. జీవో ముఖ్యాంశాలు & అధికారిక వివరాలు: రాష్ట్రంలో నాసిరకం ఆహారం, కల్తీ…

Read More

హుజూర్‌నగర్‌లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

హుజూర్‌నగర్, ఆగస్టు 17:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఎస్‌ఐ చలిగంటి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కళాబృందం ద్వారా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్…

Read More

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపకుండా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ,…

Read More

వందేమాతరం గీతం ప్రతి భారతీయుడి గుండెల్లో నిలవాలి

నిజామాబాద్, ఆగస్టు 17: (E6 tv NEWS: శివ ఠాకూర్). బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట సోమవారం వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం గీతం కీలక పాత్ర పోషించిందన్నారు. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతరం గీతం రణనినాదంగా మారి ప్రజలను చైతన్యవంతం చేసిందని తెలిపారు. బంకించంద్ర చటర్జీ దూరదృష్టితో వందేమాతరం…

Read More

కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం…

Read More

భీంగల్ బ్రహ్మంగారి దేవాలయ భూమి రికార్డులపై తెల్పాలని విశ్వబ్రాహ్మణ సంఘం వారు ప్రజావాణిలో ఫిర్యాదు..

భీంగల్ ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) భీంగల్ గ్రామంలోని నంది గల్లి బస్సు డిపో వెంకన్న ఉన్న బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోనికి తీసుకురావాలని విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినారు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల వివరణ ప్రకారము సర్వేనెంబర్ 675లోని 6.0800 ఎకరాల భూమి పాత రెవిన్యూ రికార్డు లోనికి శ్రీ బ్రహ్మం గారి దేవాలయానికి సంబంధించిన భూమి…

Read More

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు – మంచినీటి ప్లాంట్, సామాజిక పింఛన్లు ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలోని మేడారంలో పర్యటించి, సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గద్దెల వద్ద పూజారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం తన ఎత్తుకు సమానమైన బంగారాన్ని (బెల్లం) తల్లులకు నివేదించి, రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు. పూజల అనంతరం మేడారంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన రేవంత్ రెడ్డి, ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు….

Read More

అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ బీజేపీ నాయకులు

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 8వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన ప్రధానిగా పనిచేసిన ఆరేళ్ల కాలాన్ని దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన “స్వర్ణయుగం”గా వారు అభివర్ణించారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్ రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకుల ప్రసంగాలు & ముఖ్యాంశాలు: కార్యక్రమం అనంతరం రామచందర్…

Read More