Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి

కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే…

Read More

గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కుల పంపిణీ

బోధన్ ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్‌లోని గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.గత వారం వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులు పలు సమస్యలను వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందకపోవడం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం, దోమతెరలు, లైట్లు, ఫ్యాన్ల కొరతతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన నోటుబుక్కులు, మ్యాట్లు, ఇతర…

Read More

నందిపేట ప్రయాణికుల నరకయాతన కథనం నిరాధారం: టీజీఎస్ఆర్టీసీ

నిజామాబాద్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) నందిపేట ప్రయాణికుల ఇబ్బందులపై ఇటీవల ఓ పత్రికలో ప్రచురితమైన “నందిపేట ప్రయాణికుల నరకయాతన” కథనం పూర్తిగా నిరాధారమని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో మేనేజర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.నిజామాబాద్–నందిపేట మార్గంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను సమర్థవంతంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిజామాబాద్-1 డిపో నుంచి నందిపేట మధ్య 5 పల్లెవెలుగు, 4 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు….

Read More

బస్వాపూర్‌లో తాగునీటి సరఫరాపై సమీక్ష

బస్వాపూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనితీరుపై గ్రామ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.గ్రామంలోని మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు, ఏడు సింగిల్‌ఫేజ్ మోటార్ల పనితీరుపై చర్చించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలను…

Read More

పొనకల్–హైదరాబాద్ బస్సు సర్వీసు పునరుద్ధరించాలి

ఎర్గట్ల, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).పొనకల్ గ్రామం నుంచి హైదరాబాద్‌కు నిలిపివేసిన బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని ఎర్గట్ల మండల సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి సర్పంచులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, పొనకల్ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సు సర్వీసు నిలిపివేయడంతో ఎర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో దోంచందా సీబీఎస్ బస్సు, గుమ్మిర్యాల్ నైట్…

Read More

అవసరాల ఆధారిత కనీస వేతనం రూ.39,373 ఇవ్వాలి: TUCI

భీంగల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు కార్మికులకు అవసరాల ఆధారిత కనీస వేతనం నెలకు రూ.39,373 చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జాతీయ కమిటీ పిలుపులో భాగంగా భీంగల్ మండల కేంద్రంలోని ALO కార్యాలయం ఎదుట ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. అనంతరం కార్మిక శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUCI నిజామాబాద్-కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షులు…

Read More

రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా.. సద్భావన, జాతీయ ఐక్యత కోసం ప్రతిజ్ఞ

కామారెడ్డి ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది…

Read More

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాజకీయ గ్రహణం?

దళిత, పేద ప్రజలను వెంటాడుతున్న సమస్యలు.. పేదింటి కలగా మిగులుతున్న ఇందిరమ్మ ఇళ్లు వేంసూరు, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).  ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన దళిత, పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని, పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా పేదింటి కల అయిన…

Read More

మాజీ మంత్రి రేఖానాయక్ రైస్ మిల్ పై నమోదైన కేసు

నిర్మల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌కు చెందిన రైస్ మిల్లు నుంచి ₹40.96 కోట్ల విలువైన ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయమైనట్లు గుర్తించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) నిర్మల్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కేసు వివరాలు & ముఖ్యాంశాలు: మిల్లు వివరాలు:…

Read More

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

పిట్లం, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) దివంగత నేత, భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సాంకేతికతకు బాటలు వేసి భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్ విప్లవానికి నాంది పలికి, టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు…

Read More