Breaking News

టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల్లో 10% ఛార్జీల తగ్గింపు

నిజామాబాద్, జూలై 7: E6 న్యూస్(శివ ఠాకూర్). ప్రయాణికులు, వ్యాపారులు, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల ఛార్జీలపై 10 శాతం తగ్గింపు అమలు చేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు, వ్యాపారులు వినియోగించుకొని తక్కువ ఖర్చుతో కార్గో, పార్సిల్ సేవలను పొందాలని ఆయన సూచించారు. అదేవిధంగా, నిజామాబాద్-1 డిపో కార్గో కార్యాలయంలో ఉన్న క్లెయిమ్ చేయని (Unclaimed) పార్సిళ్ల వేలంను జూలై 7, 2026న…

Read More

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి MHO.

కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్). కమ్మర్పల్లి మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం వల్ల వ్యాధులను నివారించవచ్చని సూచించారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పాఠశాల వంటశాలలో పనిచేసే వంట…

Read More

వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం.

జూలై 28–30 తేదీల్లో బోధన్‌లో వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సు 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య వెల్లడి బోధన్, జూలై 6: E6 న్యూస్(ఔరాద్ అశోక్). వికలాంగుల పెన్షన్ పెంపు, హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య…

Read More

విద్యా వ్యవస్థను కాపాడుకుందాం! విద్యార్థి సంఘాల పిలుపు.

బోధన్: E6 న్యూస్ (ఔరాద్ అశోక్). బోధన్ పట్టణంలో బీఆర్ఎస్వీ (BRSV), బీవీఎఫ్ (BVF), జీవీఎస్ (GVS) గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు వడ్ల సతీష్ చారి, జాదవ్ ప్రవీణ్ నాయక్, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ, బోధన్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాయని తెలిపారు. అయితే కొందరు విద్యార్థి సంఘాల నాయకులు స్వప్రయోజనాల…

Read More

విద్యా వ్యవస్థను కాపాడుకుందాం! విద్యార్థి సంఘాల పిలుపు.

బోధన్: E6 న్యూస్ (ఔరాద్ అశోక్). బోధన్ పట్టణంలో బీఆర్ఎస్వీ (BRSV), బీవీఎఫ్ (BVF), జీవీఎస్ (GVS) గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు వడ్ల సతీష్ చారి, జాదవ్ ప్రవీణ్ నాయక్, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ, బోధన్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పట్టణాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాయని తెలిపారు. అయితే కొందరు విద్యార్థి సంఘాల నాయకులు స్వప్రయోజనాల…

Read More

నర్సాపూర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి.

కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్) కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనిట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోడెండ్ల సంజీవ్ కుమారుడికి ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే కువైట్ గంగాధర్ కుమార్తె ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల శేఖర్ తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి…

Read More

సైబర్ నేరలపై అవగాహన కల్పించిన మాక్లూర్ పోలీసులు.

మాక్లూర్, జూలై 5: E6 న్యూస్ (శివ ఠాకూర్). సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లూర్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో పలు సూచనలు చేశారు. పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారి ఆన్‌లైన్ వినియోగాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలు, కేవైసీ అప్‌డేట్, లాటరీలు, బహుమతులు తదితర పేర్లతో వచ్చే తప్పుడు ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించారు. అలాగే…

Read More

6.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

నిజామాబాద్, జూలై 5: E6 న్యూస్ నిజామాబాద్.నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డితో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీలో రూ.6.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో మార్కెట్ కమిటీ ఆధునీకరణ, షెడ్ల…

Read More

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు ఉదృతం చేయాలి: పి, రామకృష్ణ.

గాడ్కోల్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి ఘనంగా నిర్వహణ సిరికొండ, జూలై 4: E6 న్యూస్ (శివ ఠాకూర్). తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గాడ్కోల్ గ్రామంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 80వ…

Read More

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి-బిజెపి హెచ్చరిక.

“వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించం – అభివృద్ధిపై చర్చకు సిద్ధం: బీజేపీ నాయకులు” ఆర్మూర్, జూలై 4:E6 న్యూస్ (శివ ఠాకూర్). ఆర్మూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్కం వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని,…

Read More