Breaking News

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి.. వ్యక్తిగత దూషణలకు తావులేదు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 23: (E6 tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన…

Read More

మద్నూర్ మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక

మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేయించి, ఆడిట్ నివేదికను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. గత ఆర్థిక సంవత్సరంలో మండల సమాఖ్యకు రూ.5,86,413 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల ఎంపీడీవో పి. సాయిలు పాల్గొని మండల సమాఖ్య సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరాలని,…

Read More

పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది

మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 200 ఈత మొక్కలు నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ, గౌడ సంఘం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఆబ్కారీ అధికారి ఈఎస్ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటినట్లు ఎక్సైజ్ ఎస్ఐ నాగేష్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి

కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే…

Read More

భీంగల్‌లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య…

Read More

గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కుల పంపిణీ

బోధన్ ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్‌లోని గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.గత వారం వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులు పలు సమస్యలను వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందకపోవడం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం, దోమతెరలు, లైట్లు, ఫ్యాన్ల కొరతతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన నోటుబుక్కులు, మ్యాట్లు, ఇతర…

Read More

రైల్లో 24.3 కిలోల ఎండు గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకుల అరెస్ట్

నిజామాబాద్, ఆగస్టు 21: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున 12.35 గంటల సమయంలో సాయినగర్ షిర్డీ రైలులో RPF పోలీసులు, నిజామాబాద్ SHO ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తమ సీట్ల కింద రెండు సూట్‌కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. సూట్‌కేసులను తనిఖీ చేయగా మొత్తం 24.3 కిలోల ఎండు గంజాయి…

Read More

లింగంపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు

పెద్దకొడప్‌గల్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు గ్రామానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల కారణంగా వివిధ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను ప్రజలందరూ సద్వినియోగం…

Read More

మద్నూర్ మండల TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మద్నూర్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) మద్నూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా వి. భీమ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కే. లక్ష్మణ్, కోశాధికారిగా పి. సురేష్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్. దశరథ్, వైస్ ప్రెసిడెంట్లుగా సంపత్‌రెడ్డి, ఎస్. రాజు, సెక్రటరీలుగా పి. శ్రీనివాస్, టీ. విజయ్, కే. రాజు…

Read More

సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి: కాంగ్రెస్

ఎర్గట్ల, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల ఏరుగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్, ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన తీసుకువచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ నాయకులు,…

Read More