Telangana
ప్రభుత్వ భూమిపై ఆక్రమణ ఆరోపణలు.. సర్వే నంబర్ 555, 555/1పై అధికారుల ఆరా
సలీం ఫారం పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాల ఆరోపణలు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి వ్యవహారంభూమి రికార్డులు, వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు క్షేత్రస్థాయి సర్వేతోనే అసలు వాస్తవాలు తేలే అవకాశం సలీం ఫారం,నవీపేట, సెప్టెంబర్ 3 :(E6tv NEWS ప్రత్యేక కథనం-శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని సలీం ఫారం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు…
తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ రచ్చ: రాజీనామా యోచనలో మంత్రి కొండా దంపతులు!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీలో అంతర్గత విభేదాలు, అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై కొండా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు (మధ్యాహ్నం 3 గంటలకు) కొండా దంపతులు తమ అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించి, మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యాంశాలు & పరిణామాలు పరిస్థితి…
నిజాంపేట్ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటుందా?
నిజాంపేట్ భూ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటుందా? రూ.65 లక్షల హామీపై వివాదం.. 260 గజాల భూమి వ్యవహారంలో కీలక మలుపు మాజీ మేయర్ భర్త, స్థానిక కార్పొరేటర్ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నారా? బండారు లేఅవుట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాసు పాత్రపై తీవ్ర ఆరోపణలు హైదరాబాద్: నిజాంపేట్ సర్వే నంబర్ 94లోని సుమారు 260 గజాల భూమి వివాదం ఇప్పుడు రాజకీయ నేతల మెడకు చుట్టుకునే దిశగా వెళ్తోందా?…
కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన
420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
కమ్మర్పల్లి, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నర్సయ్య, వీసీ…
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు ఛిద్రం: మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజల జీవితాలను ఛిద్రం చేసింది. ప్రభుత్వానికి పని చేసేందుకు సమయం ఇచ్చినా మార్పు రాకపోవడంతో, అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల ముందు ప్రదర్శించారు; ఈ నిరసనలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ప్రజలకు…
రైతుల ప్రయోజనాలే పరమావధిగా.. సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి
లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులపై సమగ్ర సమీక్ష.. జాప్యానికి కారణాలు తెలుసుకుని, అడ్డంకులు తొలగించాలని ఆదేశం జుక్కల్, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి) రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులతో పాటు ఇతర నీటివనరుల పురోగతిని అధికారులను అడిగి…
రైతన్నలకు శుభవార్త.. నిజాంసాగర్ నుంచి సాగునీరు విడుదల
నిజాంసాగర్, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) రైతులకు శుభవార్త అందింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు సాగునీటిని పొదుపుగా, సక్రమంగా…
కవిత వ్యాఖ్యలకు వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్
కేసీఆర్కు దగ్గరగా ఉన్న వారినే కవిత టార్గెట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవితను కేసీఆర్కు తాను దూరం చేయడానికి ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండించారు.కవితను, కేసీఆర్ను కలపడానికి తానే ప్రయత్నించానని, విడగొట్టడానికి ప్రయత్నించానన్న విషయం…
వైఎస్సార్కు ఘన నివాళులు
నిజాంసాగర్ సెప్టెంబర్ 2:(E6tv NEWS ప్రతినిధి). పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల…

