Telangana
ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలపై సమీక్ష
మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ భీంగల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మండల పరిధిలో ఫామ్ పాండ్స్ (వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ గుంతలు), ఇంకుడు గుంతల నిర్మాణాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథం CCలు, VAOలు, సంబంధిత సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతి VAO పరిధిలో కనీసం రెండు ఫామ్ పాండ్స్ను…
మిలాద్ ఉన్ నబీ, పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన E6tv NEWS
మిలాద్ ఉన్ నబీ, పర్వదినాన్ని పురస్కరించుకుని E6tv NEWS ప్రేక్షకులందరికీ, మైనార్టీ సోదర సోదరీమణులందరికీ, ప్రజలందరికీ E6tv NEWS యాజమాన్యం, సిబ్బంది తరఫున హృదయపూర్వక పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి, సోదరభావం, మానవత్వం, ఐక్యత వంటి విలువలు సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు.అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వం, సిరిసంపదలను నింపాలని కోరుకున్నారు.మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలను…
మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవం
మద్నూర్, ఆగస్టు 25:(E6tv NEWS: ప్రతినిధి). ప్రతినిధిమండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ కుటుంబరావు, సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్…
ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
భీమ్గల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో భీమ్గల్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు 278 మంది…
హైదరాబాద్ టెక్ స్టార్టప్ ‘వాటర్’ $2.5 మిలియన్ల నిధుల సమీకరణ
హైదరాబాద్కు చెందిన ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Physical AI) స్టార్టప్ ‘వాటర్’ (WATER) $2.5 మిలియన్ల (సుమారు ₹23.7 కోట్లు) సీడ్ నిధులను సమీకరించింది. ఈ ఫండింగ్ రౌండ్కు ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఎండియా పార్ట్నర్స్ (Endiya Partners) నాయకత్వం వహించగా, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, డార్విన్బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి తదితర ఏంజెల్ ఇన్వెస్టర్లు భాగస్వామ్యం వహించారు. ముఖ్యమైన వివరాలు: మానవ…
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వర్సెస్ టీజీ డీజీపీ సీవీ ఆనంద్: నిఘా ఆరోపణల వివాదం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకే తెలంగాణ పోలీసులు తనపై నిఘా ఉంచారంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ తీవ్రంగా ఖండించారు. వివాదానికి సంబంధించిన ముఖ్య వివరాలు:
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వివాదం: పూర్తి వివరాలు డిమాండ్ చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని విమర్శించిన నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పందిస్తూ సీఎం అమెరికాలో ఎవరిని కలవాలని అనుకున్నారు, ఆ సమావేశాల పర్యటన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన విదేశీ పర్యటనలకు కేంద్రం ఎలాంటి అడ్డంకులు చెప్పలేదని, కాబట్టి విదేశాంగ శాఖ (MEA) నిబంధనలు మరియు ప్రక్రియల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకుని…
నిజామాబాద్ ఐడీఓసీ హెలిప్యాడ్కు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
నిజామాబాద్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఐడీఓసీ హెలిప్యాడ్కు చేరుకున్నారు. గవర్నర్కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం కావడంతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా…
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు బీజేపీ డిమాండ్
బాన్సువాడ, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల పక్షాన కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా “ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి” అంటూ నినాదాలు…
మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా తోట లక్ష్మీకాంతారావు
జుక్కల్, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేస్తానని, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…

